ఎన్నికల ప్రచారంలో బాలయ్య
- September 30, 2018
ఖమ్మం: సినీనటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈక్రమంలో బాలకృష్ణ మధిర మండలం రాయపట్నం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా బాలకృష్ణ పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. బోనకల్లు మండలం ఆళ్లపాడు, నారాయణపురంలో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం తల్లాడ నుంచి నిర్వహించే ద్విచక్ర వాహనాల ర్యాలీలో బాలయ్య పాల్గొననున్నారు. అనంతరం కిష్టారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సత్తుపల్లిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు పెనగడప చుంచుపల్లి మండలంలో పర్యటించనున్నారు. కోనేరు నాగేశ్వరరావు ఘాట్ వద్ద బాలయ్య నివాళులర్పించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు కొత్తగూడెంలో కోనేరు సత్యనారాయణ నివాసానికి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







