ఎన్నికల ప్రచారంలో బాలయ్య
- September 30, 2018
ఖమ్మం: సినీనటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈక్రమంలో బాలకృష్ణ మధిర మండలం రాయపట్నం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా బాలకృష్ణ పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. బోనకల్లు మండలం ఆళ్లపాడు, నారాయణపురంలో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం తల్లాడ నుంచి నిర్వహించే ద్విచక్ర వాహనాల ర్యాలీలో బాలయ్య పాల్గొననున్నారు. అనంతరం కిష్టారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సత్తుపల్లిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు పెనగడప చుంచుపల్లి మండలంలో పర్యటించనున్నారు. కోనేరు నాగేశ్వరరావు ఘాట్ వద్ద బాలయ్య నివాళులర్పించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు కొత్తగూడెంలో కోనేరు సత్యనారాయణ నివాసానికి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







