ఎన్నికల ప్రచారంలో బాలయ్య
- September 30, 2018
ఖమ్మం: సినీనటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈక్రమంలో బాలకృష్ణ మధిర మండలం రాయపట్నం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా బాలకృష్ణ పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. బోనకల్లు మండలం ఆళ్లపాడు, నారాయణపురంలో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం తల్లాడ నుంచి నిర్వహించే ద్విచక్ర వాహనాల ర్యాలీలో బాలయ్య పాల్గొననున్నారు. అనంతరం కిష్టారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సత్తుపల్లిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు పెనగడప చుంచుపల్లి మండలంలో పర్యటించనున్నారు. కోనేరు నాగేశ్వరరావు ఘాట్ వద్ద బాలయ్య నివాళులర్పించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు కొత్తగూడెంలో కోనేరు సత్యనారాయణ నివాసానికి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







