ఎన్నికల ప్రచారంలో బాలయ్య
- September 30, 2018
ఖమ్మం: సినీనటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈక్రమంలో బాలకృష్ణ మధిర మండలం రాయపట్నం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా బాలకృష్ణ పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. బోనకల్లు మండలం ఆళ్లపాడు, నారాయణపురంలో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం తల్లాడ నుంచి నిర్వహించే ద్విచక్ర వాహనాల ర్యాలీలో బాలయ్య పాల్గొననున్నారు. అనంతరం కిష్టారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సత్తుపల్లిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు పెనగడప చుంచుపల్లి మండలంలో పర్యటించనున్నారు. కోనేరు నాగేశ్వరరావు ఘాట్ వద్ద బాలయ్య నివాళులర్పించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు కొత్తగూడెంలో కోనేరు సత్యనారాయణ నివాసానికి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









