కేజీకి రూ.1450 చొప్పున 'అంగారకుడి' మట్టి సరఫరా

- September 30, 2018 , by Maagulf
కేజీకి రూ.1450 చొప్పున 'అంగారకుడి' మట్టి సరఫరా

అమెరికాలోని సెంట్రల్‌ ఫ్లోరిడా వర్సిటీ శాస్త్రవేత్తలు అంగారకుడిపై ఉండే లాంటి మట్టిని తయారు చేస్తున్నారు. అంగారకుడిపై నాసా 'క్యూరియాసిటీ' రోవర్‌ సేకరించిన మట్టి రసాయన లక్షణాల ఆధారంగా మట్టిని రూపొందించారు. కృత్రిమంగా రూపొందించిన మట్టిని 'సిమ్యులెంట్‌' అని పిలుస్తూ కేజీకి రూ.1450 చొప్పున ఇతరులకు సరఫరా కూడా చేస్తున్నారు. ఈ మట్టి అరుణ గ్రహంపై ఆహారాన్ని పండించే మార్గాలపై జరిపే పరిశోధనలకు తోడ్పడుతుందని, నీరు, నిత్యావసరాలను అక్కడే సమకూర్చుకునే మార్గాలను అన్వేషించే వీలు చిక్కుతుందని చెపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com