కేజీకి రూ.1450 చొప్పున 'అంగారకుడి' మట్టి సరఫరా
- September 30, 2018
అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా వర్సిటీ శాస్త్రవేత్తలు అంగారకుడిపై ఉండే లాంటి మట్టిని తయారు చేస్తున్నారు. అంగారకుడిపై నాసా 'క్యూరియాసిటీ' రోవర్ సేకరించిన మట్టి రసాయన లక్షణాల ఆధారంగా మట్టిని రూపొందించారు. కృత్రిమంగా రూపొందించిన మట్టిని 'సిమ్యులెంట్' అని పిలుస్తూ కేజీకి రూ.1450 చొప్పున ఇతరులకు సరఫరా కూడా చేస్తున్నారు. ఈ మట్టి అరుణ గ్రహంపై ఆహారాన్ని పండించే మార్గాలపై జరిపే పరిశోధనలకు తోడ్పడుతుందని, నీరు, నిత్యావసరాలను అక్కడే సమకూర్చుకునే మార్గాలను అన్వేషించే వీలు చిక్కుతుందని చెపుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







