'సవ్యసాచి' టీజర్ విడుదల
- September 30, 2018
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం 'సవ్యసాచి'. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ సరసన బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా.. సోమవారం 'సవ్యసాచి' టీజర్ను చిత్రయూనిట్ విడుదల చేశారు.
టీజర్లో.. 'ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములు అంటారు. అదే ఒకే రక్తం, ఒకే శరీరం పంచుకుని పుడితే అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలుని, వరుసకి కనిపించని అన్నని, కడదాకా ఉండే కవచాన్ని, ఈ సవ్యసాచిలో సగాన్ని' అని నాగచైతన్య చెప్పే డైలాగ్ హైలెట్.
మాధవన్, భూమిక ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా..కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









