'సవ్యసాచి' టీజర్ విడుదల
- September 30, 2018
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం 'సవ్యసాచి'. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ సరసన బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా.. సోమవారం 'సవ్యసాచి' టీజర్ను చిత్రయూనిట్ విడుదల చేశారు.
టీజర్లో.. 'ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములు అంటారు. అదే ఒకే రక్తం, ఒకే శరీరం పంచుకుని పుడితే అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలుని, వరుసకి కనిపించని అన్నని, కడదాకా ఉండే కవచాన్ని, ఈ సవ్యసాచిలో సగాన్ని' అని నాగచైతన్య చెప్పే డైలాగ్ హైలెట్.
మాధవన్, భూమిక ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా..కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి