డ్రగ్స్‌ కేసులో జంటకి జైలు శిక్ష

- October 01, 2018 , by Maagulf
డ్రగ్స్‌ కేసులో జంటకి జైలు శిక్ష

బహ్రెయిన్: డ్రగ్స్‌ కేసులో జంటకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. హై క్రిమినల్‌ కోర్ట్‌, ఇద్దరికీ ఏడాది జైలు శిక్ష ఖరారు చేసింది. నిందితుల్లో ఒకరు మహిళ కాగా, మరొకరు ఆమె భర్త. 26 ఏళ్ళ మహిళ, ఆమె భర్త డ్రగ్స్‌ కోసం వెతుకుతుండగా వారిని మనామాలో అరెస్ట్‌ చేశారు. పోలీసులకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు ఇద్దరూ పోలీసులకు దొరికారు. అరెస్ట్‌ చేసిన సమయంలో నిందితులు అబ్‌నార్మల్‌ పొజిషన్‌లో వున్నారు. తన భర్త కారణంగా తాను డ్రగ్స్‌కి బానిస అయినట్లు విచారణలో మహిళ పేర్కొంది. పాకిస్తానీ వ్యక్తి నుంచి డ్రగ్స్‌ని నిందితులు తెచ్చుకుని, తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com