ప్రముఖ దర్శకుడి ఆఫీసుకి బాంబు బెదిరింపు
- October 02, 2018
ప్రముఖ సిని దర్శకుడు మణిరత్నం అఫిస్ను పేల్చేస్తామని ఓ ఆగతంకుడు ఫోన్ చేసిన ఘటన కోలీవుడ్లో ఒక్కసారిగా కలకలం రేపింది. తాజాగా అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు,జ్యోతిక,ప్రకాశ్ రాజ్ లాంటి ప్రధాన తారగాణంతో తెరకెక్కిన తమిళ చిత్రం చెక్క చివంత వానం. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమా నవాబ్ టైటిల్తో విడుదల అయింది. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే తమిళ నాట 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో కొన్ని అభ్యంతరకర డైలాగులు ఉన్నాయి వాటిని తొలగించాలని ఓ ఆగంతకుడు మణిరత్నం అఫిస్కు ఫోన్ చేశాడు. డైలాగులని తొలగించకపోతే ఆఫీసుని పేల్చేస్తామని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన అఫిస్ సిబ్బంది షోలీసులకు సమాచారం అందించారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ ఎవరు చేశారనే దానిపై విచారణ జరుపుతున్నారు
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







