ప్రముఖ దర్శకుడి ఆఫీసుకి బాంబు బెదిరింపు
- October 02, 2018
ప్రముఖ సిని దర్శకుడు మణిరత్నం అఫిస్ను పేల్చేస్తామని ఓ ఆగతంకుడు ఫోన్ చేసిన ఘటన కోలీవుడ్లో ఒక్కసారిగా కలకలం రేపింది. తాజాగా అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు,జ్యోతిక,ప్రకాశ్ రాజ్ లాంటి ప్రధాన తారగాణంతో తెరకెక్కిన తమిళ చిత్రం చెక్క చివంత వానం. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమా నవాబ్ టైటిల్తో విడుదల అయింది. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే తమిళ నాట 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో కొన్ని అభ్యంతరకర డైలాగులు ఉన్నాయి వాటిని తొలగించాలని ఓ ఆగంతకుడు మణిరత్నం అఫిస్కు ఫోన్ చేశాడు. డైలాగులని తొలగించకపోతే ఆఫీసుని పేల్చేస్తామని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన అఫిస్ సిబ్బంది షోలీసులకు సమాచారం అందించారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ ఎవరు చేశారనే దానిపై విచారణ జరుపుతున్నారు
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







