కోల్కతాలో బాంబు పేలుడు
- October 02, 2018
కల్కత్తా లో ఈ ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. డమ్ డమ్ పోలీస్ స్టేషన్ పరిధి కాజిపార ప్రాంతంలోని ఓ పండ్ల దుకాణంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. మొదటగా గ్యాస్ సిలిండర్ పేలి ఉండొచ్చని భావించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు అది సిలిండర్ పేలుడు కాదని తేల్చారు. ఫోరెన్సిక్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బ్లాస్టింగ్ జరిగిన చోట విచారణ జరుపుతున్నారు.
డమ్ డమ్ మున్సిపాలిటి ఛైర్మన్ పంచూ రాయ్ బిల్డింగ్ లోనే ఈ పేలుడు చోటు చేసుకుంది. దీంతో ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. తనను అంతం చేసేందుకే ప్రత్యర్ధులు బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు పంచూ రాయ్ ఆరోపిస్తున్నారు. ఇది పక్కా ప్లాన్ తో చేసిన దాడి అంటున్నారాయన. టీఎంసీ నేతలను టార్గెట్ చేసుకొని ప్రత్యర్ధి పార్టీలు దాడులకు తెగబడుతున్నాయంటూ పరోక్షంగా RSSపై ఆరోపణలు చేశారాయన.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









