కోల్కతాలో బాంబు పేలుడు
- October 02, 2018
కల్కత్తా లో ఈ ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. డమ్ డమ్ పోలీస్ స్టేషన్ పరిధి కాజిపార ప్రాంతంలోని ఓ పండ్ల దుకాణంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. మొదటగా గ్యాస్ సిలిండర్ పేలి ఉండొచ్చని భావించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు అది సిలిండర్ పేలుడు కాదని తేల్చారు. ఫోరెన్సిక్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బ్లాస్టింగ్ జరిగిన చోట విచారణ జరుపుతున్నారు.
డమ్ డమ్ మున్సిపాలిటి ఛైర్మన్ పంచూ రాయ్ బిల్డింగ్ లోనే ఈ పేలుడు చోటు చేసుకుంది. దీంతో ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. తనను అంతం చేసేందుకే ప్రత్యర్ధులు బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు పంచూ రాయ్ ఆరోపిస్తున్నారు. ఇది పక్కా ప్లాన్ తో చేసిన దాడి అంటున్నారాయన. టీఎంసీ నేతలను టార్గెట్ చేసుకొని ప్రత్యర్ధి పార్టీలు దాడులకు తెగబడుతున్నాయంటూ పరోక్షంగా RSSపై ఆరోపణలు చేశారాయన.
తాజా వార్తలు
- నగరవాసులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- భారత్ టెక్స్–2026లో ఆంధ్రప్రదేశ్కు రూ.4,100 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!







