యూత్ ఒలింపిక్ గేమ్స్ కోసం బహ్రెయిన్ తరఫున నలుగురు అథ్లెట్స్
- October 02, 2018
2018 సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ కోసం బహ్రెయిన్ నలుగురు అథ్లెట్స్ని పంపనుంది. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో ఈ పోటీలు జరుగుతాయి. యూనిస్ అహ్మద్ అనాన్, మర్వా ఇబ్రహీమ్ అల్ అజూజ్, మర్యామ్ మొహమ్మద్, అల్ నబీల్ దావాని బహ్రెయిన్ తరఫున మూడు విభాగాల్లో పోటీ పడతారు. అథ్లెటిక్స్, టెన్నిస్ మరియు వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో ఈ నలుగురూ టైటిల్ కోసం పోటీ పడనున్నారు. అథ్లెటిక్స్లో అనన్, మర్వా పోటీ పడ్తారు. అనన్ మెన్స్ 400 మీటర్స్ విభాగంలో, మార్వా విమెన్స్ 100 మీటర్స్ విభాగంలోనూ పోటీ పడబోతున్నారు. మొత్తంగా ఈ పోటీల్లో 4,000 మంది అథ్లెట్స్ టైటిల్ కోసం పోటీ పడతారు. 206 దేశాల నుంచి ఆటగాళ్ళు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆసియా వెలుపల జరుగుతున్న తొలి సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్గా వీటికి మరో ప్రత్యేకత వుంది.
తాజా వార్తలు
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!









