యూత్ ఒలింపిక్ గేమ్స్ కోసం బహ్రెయిన్ తరఫున నలుగురు అథ్లెట్స్
- October 02, 2018
2018 సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ కోసం బహ్రెయిన్ నలుగురు అథ్లెట్స్ని పంపనుంది. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో ఈ పోటీలు జరుగుతాయి. యూనిస్ అహ్మద్ అనాన్, మర్వా ఇబ్రహీమ్ అల్ అజూజ్, మర్యామ్ మొహమ్మద్, అల్ నబీల్ దావాని బహ్రెయిన్ తరఫున మూడు విభాగాల్లో పోటీ పడతారు. అథ్లెటిక్స్, టెన్నిస్ మరియు వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో ఈ నలుగురూ టైటిల్ కోసం పోటీ పడనున్నారు. అథ్లెటిక్స్లో అనన్, మర్వా పోటీ పడ్తారు. అనన్ మెన్స్ 400 మీటర్స్ విభాగంలో, మార్వా విమెన్స్ 100 మీటర్స్ విభాగంలోనూ పోటీ పడబోతున్నారు. మొత్తంగా ఈ పోటీల్లో 4,000 మంది అథ్లెట్స్ టైటిల్ కోసం పోటీ పడతారు. 206 దేశాల నుంచి ఆటగాళ్ళు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆసియా వెలుపల జరుగుతున్న తొలి సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్గా వీటికి మరో ప్రత్యేకత వుంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







