యూత్ ఒలింపిక్ గేమ్స్ కోసం బహ్రెయిన్ తరఫున నలుగురు అథ్లెట్స్
- October 02, 2018
2018 సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ కోసం బహ్రెయిన్ నలుగురు అథ్లెట్స్ని పంపనుంది. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో ఈ పోటీలు జరుగుతాయి. యూనిస్ అహ్మద్ అనాన్, మర్వా ఇబ్రహీమ్ అల్ అజూజ్, మర్యామ్ మొహమ్మద్, అల్ నబీల్ దావాని బహ్రెయిన్ తరఫున మూడు విభాగాల్లో పోటీ పడతారు. అథ్లెటిక్స్, టెన్నిస్ మరియు వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో ఈ నలుగురూ టైటిల్ కోసం పోటీ పడనున్నారు. అథ్లెటిక్స్లో అనన్, మర్వా పోటీ పడ్తారు. అనన్ మెన్స్ 400 మీటర్స్ విభాగంలో, మార్వా విమెన్స్ 100 మీటర్స్ విభాగంలోనూ పోటీ పడబోతున్నారు. మొత్తంగా ఈ పోటీల్లో 4,000 మంది అథ్లెట్స్ టైటిల్ కోసం పోటీ పడతారు. 206 దేశాల నుంచి ఆటగాళ్ళు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆసియా వెలుపల జరుగుతున్న తొలి సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్గా వీటికి మరో ప్రత్యేకత వుంది.
తాజా వార్తలు
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..
- మొగుడిని చంపి..కొడుకును పొడిచిన సైకో భార్య!







