నవంబర్ 9న దుబాయ్ విమెన్స్ ట్రయథ్లాన్
- October 02, 2018



దుబాయ్: గత ఏడాది నవంబర్లో జరిగిన తొలి ఎడిషన్ దుబాయ్ విమెన్స్ ట్రయథ్లాన్ ఘనవిజయం సాధించడంతో, సెకెండ్ ఎడిషన్ని ఇంకా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 9న సెకెండ్ ఎడిషన్ దుబాయ్ విమెన్స్ ట్రయథ్లాన్ని నిర్వహించబోతున్నారు. యూఏఈ నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్, మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నాలెడ్జ్ ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్మక్తౌమ్ నేతృత్వంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. 16 ఏళ్ళ పైబడిన మహిళలు ఈ ఈవెంట్స్లో పాల్గొనేందుకు అర్హులు. సూపర్ స్ప్రింట్, స్ప్రింట్, ఒలింపిక్ డిస్టెన్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. రెండో ఎడిషన్ విమెన్స్ ట్రయథ్లాన్ నిర్వహిస్తుండడం చాలా ఆనందంగా వుందని ఈవెంట్స్ ఆర్గనైజింగ్ కమిటీ హెడ్ లామియా అబ్దుల్అజీజ్ఖాన్ చెప్పారు. దుబాయ్ లేడీస్ క్లబ్లో ఈ ఈవెంట్ జరుగుతుంది. 400 మీటర్స్ స్విమ్మింగ్, 10 కిలోమీటర్ల సైక్లింగ్, 2.5 కిలోమీటర్ల రన్ సూపర్ స్ప్రింట్లో భాగం. స్ప్రింట్లో 750 మీటర్ల స్విమ్మింగ్, 20 కిలోమీటర్ల సైక్లింగ్, 5 కిలోమీటర్ల రన్ వుంటుంది. ఒలింపిక్ డిస్టెన్స్లో 1.5 కిలోమీటర్ల స్విమ్మింగ్, 40 కిలోమీటర్ల సైక్లింగ్, 10 కిలోమీటర్ల రన్ వుంటుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







