నవంబర్ 9న దుబాయ్ విమెన్స్ ట్రయథ్లాన్
- October 02, 2018



దుబాయ్: గత ఏడాది నవంబర్లో జరిగిన తొలి ఎడిషన్ దుబాయ్ విమెన్స్ ట్రయథ్లాన్ ఘనవిజయం సాధించడంతో, సెకెండ్ ఎడిషన్ని ఇంకా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 9న సెకెండ్ ఎడిషన్ దుబాయ్ విమెన్స్ ట్రయథ్లాన్ని నిర్వహించబోతున్నారు. యూఏఈ నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్, మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నాలెడ్జ్ ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్మక్తౌమ్ నేతృత్వంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. 16 ఏళ్ళ పైబడిన మహిళలు ఈ ఈవెంట్స్లో పాల్గొనేందుకు అర్హులు. సూపర్ స్ప్రింట్, స్ప్రింట్, ఒలింపిక్ డిస్టెన్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. రెండో ఎడిషన్ విమెన్స్ ట్రయథ్లాన్ నిర్వహిస్తుండడం చాలా ఆనందంగా వుందని ఈవెంట్స్ ఆర్గనైజింగ్ కమిటీ హెడ్ లామియా అబ్దుల్అజీజ్ఖాన్ చెప్పారు. దుబాయ్ లేడీస్ క్లబ్లో ఈ ఈవెంట్ జరుగుతుంది. 400 మీటర్స్ స్విమ్మింగ్, 10 కిలోమీటర్ల సైక్లింగ్, 2.5 కిలోమీటర్ల రన్ సూపర్ స్ప్రింట్లో భాగం. స్ప్రింట్లో 750 మీటర్ల స్విమ్మింగ్, 20 కిలోమీటర్ల సైక్లింగ్, 5 కిలోమీటర్ల రన్ వుంటుంది. ఒలింపిక్ డిస్టెన్స్లో 1.5 కిలోమీటర్ల స్విమ్మింగ్, 40 కిలోమీటర్ల సైక్లింగ్, 10 కిలోమీటర్ల రన్ వుంటుంది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







