గుండెలను పిండేసిన అరవింద
- October 02, 2018
అశేష అభిమానుల సమక్షంలో. భావోద్వేగాల నడుమ "అరవింద సమేత" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసింది. తండ్రి హరికృష్ణ మరణం తర్వాత మొదటిసారిగా అభిమానుల ముందుకొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కన్నీటిపర్యంతం అయ్యారు. ఒకానొక దశలో తన ఏమోషన్స్ ను నియత్రించుకోలేకపోయారు. ముఖ్యంగా 'అరవింద సమేత'కు రిలేట్ చేస్తూ తారక్ చెప్పిన డైలాగ్, వీక్షకుల మనసులను కూడా బరువెక్కించింది.
"ఈ సినిమాతో కలిపి ఇప్పటివరకు తాను 28 సినిమాలు చేశాను, అయితే 27 సినిమాలలో ఎప్పుడూ ఏ దర్శకుడు తండ్రి చితికి నిప్పటించే సన్నివేశం పెట్టలేదు, బహుశా డెస్టినీ అంటే ఇదేనేమో. ఈ సినిమాలో మా దర్శకుడు త్రివిక్రమ్ ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు, మనం ఒకటనుకుంటే, పైన వాడు మరొకటి రాస్తాడు అంటే ఇదేనేమో" అంటూ బరువెక్కిన గుండెలతో తారక్ తన భావాలను వ్యక్తపరిచాడు.
ఈ ఒక్క సినిమా చూడడానికైనా తన తండ్రి బ్రతికి ఉంటే బాగుండేదని, 'యుద్ధం ఆపగలిగే వాడే గొప్పోడు' అన్న విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పామని, నా కెరీర్ లో మైలురాయిలా నిలిచిపోయే సినిమాను త్రివిక్రమ్ అందించారని "అరవింద సమేత" ఘనవిజయంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు జూనియర్ ఎన్టీఆర్. ఫైనల్ గా. వెళ్తూ వెళ్తూ అందరినీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమని, ఈ మాట తన తండ్రికి చెప్పలేకపోయాను, మీకు చెప్తున్నాను, దయచేసి వినండి. అంటూ విన్నవించుకున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







