గుండెలను పిండేసిన అరవింద
- October 02, 2018
అశేష అభిమానుల సమక్షంలో. భావోద్వేగాల నడుమ "అరవింద సమేత" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసింది. తండ్రి హరికృష్ణ మరణం తర్వాత మొదటిసారిగా అభిమానుల ముందుకొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కన్నీటిపర్యంతం అయ్యారు. ఒకానొక దశలో తన ఏమోషన్స్ ను నియత్రించుకోలేకపోయారు. ముఖ్యంగా 'అరవింద సమేత'కు రిలేట్ చేస్తూ తారక్ చెప్పిన డైలాగ్, వీక్షకుల మనసులను కూడా బరువెక్కించింది.
"ఈ సినిమాతో కలిపి ఇప్పటివరకు తాను 28 సినిమాలు చేశాను, అయితే 27 సినిమాలలో ఎప్పుడూ ఏ దర్శకుడు తండ్రి చితికి నిప్పటించే సన్నివేశం పెట్టలేదు, బహుశా డెస్టినీ అంటే ఇదేనేమో. ఈ సినిమాలో మా దర్శకుడు త్రివిక్రమ్ ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు, మనం ఒకటనుకుంటే, పైన వాడు మరొకటి రాస్తాడు అంటే ఇదేనేమో" అంటూ బరువెక్కిన గుండెలతో తారక్ తన భావాలను వ్యక్తపరిచాడు.
ఈ ఒక్క సినిమా చూడడానికైనా తన తండ్రి బ్రతికి ఉంటే బాగుండేదని, 'యుద్ధం ఆపగలిగే వాడే గొప్పోడు' అన్న విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పామని, నా కెరీర్ లో మైలురాయిలా నిలిచిపోయే సినిమాను త్రివిక్రమ్ అందించారని "అరవింద సమేత" ఘనవిజయంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు జూనియర్ ఎన్టీఆర్. ఫైనల్ గా. వెళ్తూ వెళ్తూ అందరినీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమని, ఈ మాట తన తండ్రికి చెప్పలేకపోయాను, మీకు చెప్తున్నాను, దయచేసి వినండి. అంటూ విన్నవించుకున్నారు.
తాజా వార్తలు
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







