తల్లి శవంపై కూర్చుని తాంత్రిక పూజలు..

- October 03, 2018 , by Maagulf
తల్లి శవంపై కూర్చుని తాంత్రిక పూజలు..

తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో తాంత్రిక పూజలు కలకలం రేపాయి. ఓ అఘోరా చనిపోయిన తన తల్లి అంతిమ సంస్కారాల్లో భాగంగా శ్మశానంలో పూజలు చేశాడు. ఆమె డెడ్‌బాడీపైనే కూర్చుని పెద్ద ఎత్తున మంత్రాలు జపిస్తూ హడావుడి చేశాడు. ఇది చూసి స్థానికులు హడలిపోయారు. శ్రాద్ధకర్మల్లో భాగంగా ఇవన్నీ చేసినట్టు అఘోరాగా మారిన మణికండన్ చెప్తున్నాడు. కొన్నేళ్ల క్రితం కాశీ నుంచి తిరిగి వచ్చిన అతను అరియమంగళం ప్రాంతంలోని ఓ ఆలయం వద్ద ఉంటున్నాడు. 70 ఏళ్ల తన తల్లి అనారోగ్యంతో మరణించడంతో అంత్యక్రియల్లో భాగంగా ఇలా పూజలు చేయడం అందర్నీ గగుర్పాటుకు గురి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com