'చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్' గా నిలిచిన మోడీ
- October 03, 2018
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును అందుకున్నారు. పర్యావరణ సమతుల్యం కోసం కృషి చేసిన మోదీకి.. ఐక్యరాజ్యసమితి ఈ అవార్డును ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటరెస్ చేతుల మీదుగా ఈ అవార్డును మోదీ అందుకున్నారు. చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును స్వీకరించడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ఈ పురస్కారం భారతీయులకు గౌరవాన్నిచ్చిందన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు భారతీయులు కట్టుబడి ఉన్నారన్నారు. పర్యావరణం, విపత్తు.. రెండింటికీ సంస్కృతితో సంబంధం ఉన్నాయని, పర్యావరణం గురించి మన సంస్కృతి ఆలోచించకుంటే, విపత్తులను నివారించలేమని మోదీ అన్నారు. సబ్ కా సాత్ నినాదంలోనే, ప్రకృతి పరిరక్షణ కూడా ఉందని ప్రధాని తెలిపారు.
ప్రధాని మోదీతో పాటు మరో ఆరుగురికి చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును ఇటీవల యూఎన్ ప్రకటించింది. ఫ్రాన్స్తో అంతర్జాతీయ సౌర ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో మోదీని ఈ అవార్డు వరించింది. పర్యావరణ పరిరక్షణ కోసం మోదీ నడుం బిగించారని యూఎన్ ప్రధాన కార్యదర్శి గుటరెస్ తెలిపారు. పర్యావరణ రక్షణ కోసం ప్రపంచ దేశాలు భారత్ను ప్రేరణగా తీసుకోవాలని ఆంటోనియో తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి