'చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్' గా నిలిచిన మోడీ
- October 03, 2018
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును అందుకున్నారు. పర్యావరణ సమతుల్యం కోసం కృషి చేసిన మోదీకి.. ఐక్యరాజ్యసమితి ఈ అవార్డును ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటరెస్ చేతుల మీదుగా ఈ అవార్డును మోదీ అందుకున్నారు. చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును స్వీకరించడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ఈ పురస్కారం భారతీయులకు గౌరవాన్నిచ్చిందన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు భారతీయులు కట్టుబడి ఉన్నారన్నారు. పర్యావరణం, విపత్తు.. రెండింటికీ సంస్కృతితో సంబంధం ఉన్నాయని, పర్యావరణం గురించి మన సంస్కృతి ఆలోచించకుంటే, విపత్తులను నివారించలేమని మోదీ అన్నారు. సబ్ కా సాత్ నినాదంలోనే, ప్రకృతి పరిరక్షణ కూడా ఉందని ప్రధాని తెలిపారు.
ప్రధాని మోదీతో పాటు మరో ఆరుగురికి చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును ఇటీవల యూఎన్ ప్రకటించింది. ఫ్రాన్స్తో అంతర్జాతీయ సౌర ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో మోదీని ఈ అవార్డు వరించింది. పర్యావరణ పరిరక్షణ కోసం మోదీ నడుం బిగించారని యూఎన్ ప్రధాన కార్యదర్శి గుటరెస్ తెలిపారు. పర్యావరణ రక్షణ కోసం ప్రపంచ దేశాలు భారత్ను ప్రేరణగా తీసుకోవాలని ఆంటోనియో తెలిపారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







