యూఏఈ ఆమ్నెస్టీ: తెలంగాణ కార్మికులకు టిక్కెట్లు అందించిన తెరాస NRI కో-అర్డినేటర్
- October 03, 2018
యూ.ఏ.ఈ:జీవనోపాధి కోసం యూఏఈ వెళ్లి రకరకాల కారణాల వల్ల అక్కడే చిక్కుకుపోయిన తెలంగాణ బిడ్డలను ఆ దేశం కల్పించిన ఆమ్నెస్టీ అవకాశంతో అక్కడ ఉన్న తెలంగాణ కార్మికుల బాధలు తెలుసుకొని వారికి విమాన టిక్కెట్లు సమకూర్చి ప్రభుత్వ పరంగా మంత్రి కేటీఆర్ స్వదేశానికి రప్పించిన తీరు మరియు చొరవకు అలాగే ముఖ్యమంత్రి కేసిర్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా సహాయసహకారాలను అందించి దీనిని ముందుకు నడిపించి, ఇక్కడ ఉన్న సమస్యలను స్యయంగా చూసి, అవగాహన చేసుకుని మరియు అన్ని పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వనికి వివరించిన తెరాస NRI కో-అర్డినేటర్ మహేష్ బిగాల కి కూడా TRS NRI Cell Dubai UAE తరపున ధన్యవాదాలు తెలపటం జరిగింది.విమానాశ్రయం వద్ద ఈ టిక్కెట్ల పంపిణి కార్యక్రమంలో అరవింద్ సింగ్,చిట్టిబాబు,కోటపాటి నర్సింహా నాయుడు,నరేష్ ,రవి ఉట్నూరి,రమేష్ ఏముల,గుండల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.




తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







