వృద్ధులకు షార్జా పబ్లిక్ బస్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం
- October 03, 2018
షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, పబ్లిక్ బస్సుల్లో వృద్ధులకు ఎలాంటి రుసుము తీసకోకుండా కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్కి ట్యాక్సీల్లో తక్కువ ఫేర్తో అవకాశం కల్పించేలా కూడా నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ప్రొక్యూర్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ హెడ్ యూసుఫ్ సులైమాన్ అల్ హమ్మాది మాట్లాడుతూ, వృద్ధుల పట్ల ఎమిరేట్కి వున్న గొప్ప ఆలోచనను ఈ నిర్ణయం బయటపెట్టిందని చెప్పారు. ఇయర్ ఆఫ్ జాయెద్లో భాగంగా, ఈ గొప్ప కార్యక్రమం చేపట్టడం పట్ల ఆనందంగా వుందని ఆయన వివరించారు. లబ్ది దారులకోసం ప్రత్యేక పర్మిట్లను త్వరలో జారీ చేయబోతున్నారు. అప్పటిదాకా తమ ఐడీ కార్డుల్ని టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు వినియోగించుకోవచ్చు. 62 ఏళ్ళ ఈజిప్టియన్ హస్సన్ అబ్దుల్లా, వృద్ధుల పట్ల ఆర్టిఎ చూపుతున్న చొరవను అభినందిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







