మెర్స్‌తో సౌదీలో 10 మంది మృతి

- October 04, 2018 , by Maagulf
మెర్స్‌తో సౌదీలో 10 మంది మృతి

మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (మెర్స్‌) కారణంగా సౌదీ అరేబియాలో జూన్‌ నుంచి మొత్తం 32 మంది అనారోగ్యానికి గురికాగా, అందులో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యుహెచ్‌వో) వెల్లడించింది. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 16 వరకునమోదైన కేసుల్ని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మెర్స్‌ కేసుల సంఖ్య 2,254 కాగా, 800 మంది ప్రాణాలు కోల్పోయారు. మనుషుల్లో తొలిసారిగా మెర్స్‌ని సౌదీ అరేబియాలో 2012లో గుర్తించారు. క్రమక్రమంగా ఇది ప్రపంచమంతటా విస్తరించింది. మొత్తంగా ఈ వ్యాధి బారిన పడ్డవారిలో 1800 మంది సౌదీ అరేబియాకి చెందినవారే. మెర్స్‌ కారణంగా రెస్పిరేటరీ సమస్యలు తలెత్తుతాయి. ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సమస్య కారణంగా ప్రాణాలు కోల్పోతారు. హెల్త్‌ కేర్‌ విభాగంలోనివారికి ఈ వ్యాధిగ్రస్తుల నుంచి ముప్పు పొంచి వుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com