యూఏఈ న్యూ వీసా సిస్టమ్..
- October 04, 2018
యూఏఈ:ప్రస్తుతం అమల్లో వున్నట్లుగా 3,000 దిర్హామ్ల డిపాజిట్ స్థానే, ఒక్కో వర్కర్కీ కేవలం 60 దిర్హామ్ల ఇన్స్యూరెన్స్ స్కీమ్ని యూఏఈలో ప్రైవేటు కంపెనీలు త్వరలో అందిపుచ్చుకోనున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్, లోకాస్ట్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ని మిడ్ అక్టోబర్ నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది. జూన్లో జారీ చేసిన కొత్త క్యాబినెట్ డెసిషన్ నేపథ్యంలో, ఒక్కో వర్కర్కీ 20,000 దిర్హామ్ల కవర్ చేసేలా స్కీమ్ అమల్లోకి రానుంది. ఇందులో సర్వీస్ బెనిఫిట్స్, వెకేషన్ మరియు ఓవర్టైన్ అలవెన్సెస్, అన్పెయిడ్ వేజెస్, రిటర్న్ ఎయిర్ టిక్కెట్స్, వర్క్ ఇంజ్యూరీస్లను ఈ స్కీమ్ కవర్ చేస్తుంది. దేశంలో కాస్ట్ ఆఫ్ డూయింగ్ని తగ్గించే క్రమంలో ఈ కొత్త స్కీమ్ని అమల్లోకి తెస్తున్నారు. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ నాజర్ అల్ హామ్లి మాట్లాడుతూ, న్యూ స్కీమ్ ద్వారా వర్కర్స్ హక్కులు మరియు సేలరీస్కి భద్రత ఏర్పడుతుందని, అలాగే కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని చెప్పారు. మినిస్ట్రీ, దుబాయ్ ఇన్స్యూరెన్స్ కంపెనీతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో గ్రూప్ ఇన్స్యూరెన్స్ చేపడ్తారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!







