టీసీఎస్లో కొత్త ఉద్యోగాలు..
- October 04, 2018టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సుమారు వెయ్యి కొత్త ఉద్యోగ నియామకాల్ని చేపట్టనుంది. ఇందుకు నేషనల్ క్వాలిఫయిర్ టెస్ట్ (ఎన్క్యూటీ) ద్వారా ఉద్యోగుల్ని ఎంపిక చేయనున్నారు. ఏడాదికి రూ.6.5 లక్షల ప్యాకేజీతో డిజిటల్ నైపుణ్యం కలిగిన ఇంజనీర్లను సంస్థ నియమించనున్నట్లు టీసీఎస్ గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ అజయ్ ముఖర్జీ తెలిపారు. ఇతర ఇంజనీరింగ్ ఉద్యోగాల ప్రారంభ జీతం ఏడాదికి రూ.3.5 లక్షలు ఉండగా టీసీఎస్ దాదాపు రెట్టింపు జీతంతో బంపర్ ఆఫర్ ఇస్తోందని చెప్పారు.
ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని డిజిటల్ పూల్ టెస్ట్కు ఆహ్వానిస్తారు. ఈ పరీక్ష కూడా పాసైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేసిన వారిని ఉద్యోగులుగా టీసీఎస్ సంస్థ నియమిస్తుంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు