ఉసిరికాయని నేతిలో వేయించుకుని తీసుకుంటే ఉపయోగాలు...
- October 04, 2018
ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. చాలామందికైతే చలి వలన జలుబు, దగ్గు, తలనొప్పి, తుమ్ములు వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకు వైద్య చికిత్సలు తీసుకుంటుంటారు. అయినా కూడా ఎటువంటి లాభం లేదని బాధపడుతుంటారు. అందుకు ఆయుర్వేదం ప్రకారం ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఈ వాతావరణం కారణంగా జలుబు, తుమ్ములు, దగ్గు వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కాలంలో దొరికే ఉసిరికాయలు ఈ సమస్యలు మంచి పరిష్కారం. అందుకు ప్రతిరోజూ ఉసిరికాయను నేతిలో వేయించుకుని తేనెలో కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఇంగువ చూర్ణాన్ని వేడినీటిలో మరిగించుకుని అందులో కొద్దిగా ఆవునెయ్యి కలుపుకుని ప్రతిరోజూ మూడుపూటలా సేవిస్తే ఆయాసం, తలనొప్పి వంటి సమస్యలు దరిచేరవు. అయినా కూడా తగ్గలేదనుకుంటే వాము చూర్ణాన్ని, పటిక బెల్లాన్ని వేడినీళ్లల్లో మరిగించుకుని తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









