ఒమన్‌ షిప్పింగ్‌ పోర్టులో నలుగురు వలసదారుల మృతి

- October 05, 2018 , by Maagulf
ఒమన్‌ షిప్పింగ్‌ పోర్టులో నలుగురు వలసదారుల మృతి

ఒమన్‌:ఓ షిప్‌ని క్లీన్‌ చేస్తుండగా, అందులో ఇరుక్కుపోయి నలుగురు వలస కార్మికులు మృతి చెందినట్లు ఒమన్‌ పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ (పిఎసిడిఎ) పేర్కొంది. సలాలా పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన నలుగురూ ఆసియా జాతీయులని పిఎసిడిఎ వెల్లడించింది. షిప్‌ని క్లీన్‌ చేస్తుండగా నలుగురు కార్మికులు ఇరుక్కుపోయారని సమాచారం అందడంతో, పిఎసిడిఎ - హజార్డస్‌ మెటీరియల్స్‌ డీలింగ్‌ టీమ్‌ రంగంలోకి దిగి, వారి ఈచూకీని కనుగొన్నట్లు పిఎసిడిఎ వర్గాలు పేర్కొన్నాయి. వారిని సజీవంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, అప్పటికే వారు మృతి చెందడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com