షిర్డీసాయి భక్తులకు శుభవార్త...
- October 06, 2018
షిర్డీ : షిర్డీసాయి భక్తులకు శుభవార్త. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 18వతేదీన షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని భక్తుల సందర్శన కోసం 24 గంటలపాటు తెరచి ఉంచాలని శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు నిర్ణయించింది. సాధారణంగా సాయిబాబా ఆలయాన్నితెల్లవారుజామున నాలుగుగంటలకు తెరచి ఆరతి అనంతరం రాత్రి 11 గంటలకు మూసివేస్తారు. కాని షిర్డీసాయి 100వ జయంతోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో 18వతేదీన దేవాలయాన్ని 24 గంటలూ తెరచి ఉంచుతామని శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ప్రకటించింది. సాధారణంగా రోజుకు 50 నుంచి 70వేల మంది భక్తులు షిర్డీ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. దసరా సందర్భంగా ఈ నెల 17 నుంచి 19వతేదీ వరకు ఏడులక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. దసరా సందర్భంగా భక్తులందరికీ దర్శనం కల్పించాలనే లక్ష్యంతో పెయిడ్ వీఐపీ పాసుల జారీని నిలిపివేయాలని ట్రస్టు నిర్ణయించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







