షిర్డీసాయి భక్తులకు శుభవార్త...
- October 06, 2018
షిర్డీ : షిర్డీసాయి భక్తులకు శుభవార్త. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 18వతేదీన షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని భక్తుల సందర్శన కోసం 24 గంటలపాటు తెరచి ఉంచాలని శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు నిర్ణయించింది. సాధారణంగా సాయిబాబా ఆలయాన్నితెల్లవారుజామున నాలుగుగంటలకు తెరచి ఆరతి అనంతరం రాత్రి 11 గంటలకు మూసివేస్తారు. కాని షిర్డీసాయి 100వ జయంతోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో 18వతేదీన దేవాలయాన్ని 24 గంటలూ తెరచి ఉంచుతామని శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ప్రకటించింది. సాధారణంగా రోజుకు 50 నుంచి 70వేల మంది భక్తులు షిర్డీ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. దసరా సందర్భంగా ఈ నెల 17 నుంచి 19వతేదీ వరకు ఏడులక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. దసరా సందర్భంగా భక్తులందరికీ దర్శనం కల్పించాలనే లక్ష్యంతో పెయిడ్ వీఐపీ పాసుల జారీని నిలిపివేయాలని ట్రస్టు నిర్ణయించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!