ఘోర రోడ్డు ప్రమాదం..20 మంది దుర్మరణం
- October 07, 2018
అమెరికాలోని న్యూయార్క్లో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 20 మంది చనిపోయారు. ఆల్బెనీ సమీపంలోని స్కోహరీ కౌంటీలో రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఓ ఎస్యూవీ తరహా పొడవాటి లిమౌసిన్ కారు రోడ్డు పక్కన పాదచారులను వేగంగా ఢీకొని ఓ స్టోర్లోకి దూసుకెళ్లింది. లిమౌసిన్ కారులో వివాహ రిసప్షన్కు వెళ్తున్న ఓ పెళ్లి బృందం ఉంది. చనిపోయిన 20 మందిలో కారులో ఉన్న వారు ఎంతమంది.. పాదచారులు ఎంతమంది.. అనే విషయాలతోపాటు చనిపోయిన వారి పేర్లను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. యాపిల్ బారెల్ కంట్రీ స్టోర్ అండ్ కేఫ్కు వెలుపల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతం న్యూయార్క్కు 270 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రమాదం సమయంలో లిమోనస్ వెహికిల్ పెళ్లి బృందాన్ని తీసుకు వస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







