ఘోర రోడ్డు ప్రమాదం..20 మంది దుర్మరణం
- October 07, 2018
అమెరికాలోని న్యూయార్క్లో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 20 మంది చనిపోయారు. ఆల్బెనీ సమీపంలోని స్కోహరీ కౌంటీలో రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఓ ఎస్యూవీ తరహా పొడవాటి లిమౌసిన్ కారు రోడ్డు పక్కన పాదచారులను వేగంగా ఢీకొని ఓ స్టోర్లోకి దూసుకెళ్లింది. లిమౌసిన్ కారులో వివాహ రిసప్షన్కు వెళ్తున్న ఓ పెళ్లి బృందం ఉంది. చనిపోయిన 20 మందిలో కారులో ఉన్న వారు ఎంతమంది.. పాదచారులు ఎంతమంది.. అనే విషయాలతోపాటు చనిపోయిన వారి పేర్లను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. యాపిల్ బారెల్ కంట్రీ స్టోర్ అండ్ కేఫ్కు వెలుపల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతం న్యూయార్క్కు 270 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రమాదం సమయంలో లిమోనస్ వెహికిల్ పెళ్లి బృందాన్ని తీసుకు వస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి