వారం రోజులపాటు కేవలం ఆన్లైన్లోనే గవర్నమెంట్ సర్వీసులు
- October 07, 2018
దుబాయ్: 1000కి పైగా గవర్నమెంట్ సర్వీసులు వారం రోజులపాటు కేవలం ఆన్లైన్లోనే అభ్యమవుతాయి. అక్టోబర్ 21 నుంచి 25 వరకు ఈ విధానం అందుబాటులో వుంటుంది. గవర్నమెంట్ యాప్స్, ఇ-సర్వీసెస్ని ప్రమోట్ చేసే క్రమంలో ఇది అత్యంత కీలకమైన అడుగు అని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ పేర్కొంది. దుబాయ్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన స్మార్ట్ సిటీగా మలచేందుకు ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఎంపిక చేసిన తేదీల్లో వినియోగదారులు, స్మార్ట్ ఛానల్స్ ద్వారా మాత్రమే గవర్నమెంట్ సర్వీసులు పొందగలుగుతారు. ఈ రోజుల్లో మ్యాన్డ్ సర్వీస్ సెంటర్స్ పనిచేయవు. బిల్స్ పేమెంట్, కస్టమర్ క్వరీస్ రిజిస్ట్రేషన్ వంటివన్నీ ఆన్లైన్లోనే లభ్యమవుతాయి. 2017 'ఎ డే వితౌట్ సర్వీస్ సెంటర్స్' కార్యక్రమాన్ని వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రారంభించారు. అది చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఈసారి వారం రోజులపాటు కేవలం ఆన్లైన్లోనే సేవల్ని అందుబాటులో వుంచడం ద్వారా, ఇంకా పెద్ద విజయాన్ని సాధించగలమని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెసిడెంట్స్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







