వారం రోజులపాటు కేవలం ఆన్లైన్లోనే గవర్నమెంట్ సర్వీసులు
- October 07, 2018
దుబాయ్: 1000కి పైగా గవర్నమెంట్ సర్వీసులు వారం రోజులపాటు కేవలం ఆన్లైన్లోనే అభ్యమవుతాయి. అక్టోబర్ 21 నుంచి 25 వరకు ఈ విధానం అందుబాటులో వుంటుంది. గవర్నమెంట్ యాప్స్, ఇ-సర్వీసెస్ని ప్రమోట్ చేసే క్రమంలో ఇది అత్యంత కీలకమైన అడుగు అని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ పేర్కొంది. దుబాయ్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన స్మార్ట్ సిటీగా మలచేందుకు ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఎంపిక చేసిన తేదీల్లో వినియోగదారులు, స్మార్ట్ ఛానల్స్ ద్వారా మాత్రమే గవర్నమెంట్ సర్వీసులు పొందగలుగుతారు. ఈ రోజుల్లో మ్యాన్డ్ సర్వీస్ సెంటర్స్ పనిచేయవు. బిల్స్ పేమెంట్, కస్టమర్ క్వరీస్ రిజిస్ట్రేషన్ వంటివన్నీ ఆన్లైన్లోనే లభ్యమవుతాయి. 2017 'ఎ డే వితౌట్ సర్వీస్ సెంటర్స్' కార్యక్రమాన్ని వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రారంభించారు. అది చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఈసారి వారం రోజులపాటు కేవలం ఆన్లైన్లోనే సేవల్ని అందుబాటులో వుంచడం ద్వారా, ఇంకా పెద్ద విజయాన్ని సాధించగలమని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెసిడెంట్స్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







