ముఠా కాల్పులు..భారతీయుడు మృతి
- October 08, 2018
బ్యాంకాక్: రెండు ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక భారతీయుడు, మరో విదేశీ పర్యటకుడు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయని బ్యాంకాంక్ పోలీసులు సోమవారం తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. రాంచదీవి జిల్లాలోని సెంటరా వాటర్గేట్ పెవిలియన్ హోటర్ వెనుక రహదారిలో ఆదివారం రాత్రి ఈ కాల్పులు చోటుచుసుకున్నాయని పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ భారత్కు చెందిన గక్రేజ్ ధీరజ్ మరొక పర్యాటకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడ్డ ఐదుగురిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. భారత్కు చెందిన రెస్టారెంట్లో భారతీయులతో సహా, విదేశీ పర్యటకులు డిన్నర్ చేసి, వారి బస్సు కోసం పార్కింగ్ ప్రదేశంలో వేచి చూస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వారు అక్కడ ఉండగానే స్నూకర్ క్లబ్ నుండి యువకుల బృందం రెండు వర్గాలుగా కూడా అక్కడకు చేరుకున్నాయని పోలీసు అధికారి తెలిపారు. అనంతరం వారి మధ్య కాల్పులు చోటుచేసుకున్నారయని తెలిపారు. పిస్టల్స్, కత్తులు, కర్రలతో ఉన్న సుమారు 20 మంది వ్యక్తులు క్లబ్ నుండి వీధిలోకి నడిచారని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. కాగా, పోలీసులు వస్తున్న సమయానికి రెండు ముఠాలు పారిపోగా, వారిలో ఎవరూ పోలీసులకు చిక్కలేదు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







