డీఆర్డీవోలో పనిచేస్తున్న పాక్ ఏజెంట్ అరెస్ట్
- October 08, 2018
భారతీయ రక్షణ సంస్థలో మరో అతిపెద్ద పొరపాటు వెలుగు చూసింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఉన్న డీఆర్డీవో యూనిట్ లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి చెందిన ఒక ఏజెంట్ ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన ఏజెంట్ బ్రహ్మోస్ యూనిట్ లో పని చేసేవాడు. ఈ గూఢచారి డీఆర్డీవోకి చెందిన అత్యంత రహస్య సమాచారాన్ని ఐఎస్ఐకి అందజేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై నాగ్ పూర్ పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు యూపీ ఏటీఎస్ ఈ ఉదయం నాగ్ పూర్ లో మరో ఏజెన్సీతో కలిసి ఈ గూఢచారిని అరెస్ట్ చేసింది. ఈ ఏజెంట్ పేరు నిశాంత్ అగర్వాల్ అని తెలుస్తోంది. ఇతను నాగ్ పూర్ లోని డీఆర్డీవో యూనిట్ లో చాలా కాలంగా పని చేస్తున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







