యూఏఈ టూర్ లోగో ఆవిష్కరణ
- October 08, 2018దుబాయ్: నబూదా ఆటో మొబైల్స్ - ఆడి దుబాయ్ షోరూమ్లో, యూఏఈ టూర్ సుప్రీమ్ ఆర్గనైజింగ్ కమిటీ, కొత్త లోగోనీ విన్నర్ ట్రోఫీనీ ఆవిష్కరించింది. సెవెన్ సైడెడ్లో ఈ లోగో ఆకర్షణీయంగా రూపొందింది. అబుదాబీ, దుబాయ్, షార్జా, అజ్మన్, ఫుజారియా, రస్ అల్ ఖైమా, ఉమ్ అల్ కువైన్ ఎమిరేట్స్ని ప్రతిబింబించేలా సెవెన్ సైడెడ్ లోగోని రూపొందించారు. దుబాయ్ టూర్, అబుదాబీ టూర్ని మెర్జ్ చేసి 2019లో దుబాయ్ టూర్ పేరుతో రేస్ని నిర్వహించబోతున్నారు. అబుదాబీ స్పోర్ట్స్ కౌన్సిల్ దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్, ఆర్సిఎస్ స్పోర్ట్తో కలిసి ఈ ఈవెంట్ని నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 2 వరకు మొత్తం ఏడు ఎమిరేట్స్ని కలిపేలా ఈ రేస్ వుంటుంది. 5.5 కిలోల బరువుతో 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ ట్రోఫీ చాలా అద్భుతంగా రూపొందించడం జరిగింది. అబుదాబీ స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ ఆరిఫ్ అల్ అవానీ, యూఏఈ సైక్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఒసామా అల్ షఫార్, ఆర్సిఎస్ స్పోర్ట్స్ డిఎంసిసి సిఇఓ ఎన్రికో ఫిలి, అల్ నబూదా ఆటోమొబైల్స్ ఆడి జనరల్ మేనేజర్ అలి అల్ నబూదా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..