కామాంధులకు బలైన మహిళా జర్నలిస్టు
- October 08, 2018


రూస్: బల్గేరియాలో ఓ మహిళా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు దారుణంగా హత్యకు గురైంది. 30 ఏళ్ల విక్టోరియా మారినోవాను అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన రూస్ పట్టణంలో జరిగింది. మారినోవా ఓ ఛానల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తోంది. యురోపియన్ యూనియన్ నిధుల్లో జరిగిన అవకతవకలపై ఆమె గత కొన్నాళ్లూగా కథనాలను రాస్తోంది. అయితే ఆమె మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ మారినోవా తలకు భారీ గాయాలు అయ్యాయి. ఊపిరి ఆడక ఆమె మృతిచెందినట్లు కూడా డాక్టర్లు తేల్చారు. హత్య చేయడానికి ముందు ఆ జర్నలిస్టును రేప్ చేశారని స్థానిక మీడియా పేర్కొన్నది. గత ఏడాది కాలంలో యూరోప్ దేశాల్లో జర్నలిస్టులు హత్యకు గురికావడం ఇది మూడవ ఘటన. బల్గేరియాలో పాపులర్ అయిన టీవీఎన్ ఛానల్లో మారినోవా పనిచేస్తున్నది. ఓ సైకియాట్రీ సెంటర్ వద్ద ఆమె మృతదేహం ఉన్న కారణంగా.. అక్కడున్న పేషెంట్ ఎవరైనా ఆమెపై దాడి చేసి ఉంటారా అన్న కోణంలోనూ విచారణ నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..







