కామాంధులకు బలైన మహిళా జర్నలిస్టు
- October 08, 2018


రూస్: బల్గేరియాలో ఓ మహిళా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు దారుణంగా హత్యకు గురైంది. 30 ఏళ్ల విక్టోరియా మారినోవాను అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన రూస్ పట్టణంలో జరిగింది. మారినోవా ఓ ఛానల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తోంది. యురోపియన్ యూనియన్ నిధుల్లో జరిగిన అవకతవకలపై ఆమె గత కొన్నాళ్లూగా కథనాలను రాస్తోంది. అయితే ఆమె మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ మారినోవా తలకు భారీ గాయాలు అయ్యాయి. ఊపిరి ఆడక ఆమె మృతిచెందినట్లు కూడా డాక్టర్లు తేల్చారు. హత్య చేయడానికి ముందు ఆ జర్నలిస్టును రేప్ చేశారని స్థానిక మీడియా పేర్కొన్నది. గత ఏడాది కాలంలో యూరోప్ దేశాల్లో జర్నలిస్టులు హత్యకు గురికావడం ఇది మూడవ ఘటన. బల్గేరియాలో పాపులర్ అయిన టీవీఎన్ ఛానల్లో మారినోవా పనిచేస్తున్నది. ఓ సైకియాట్రీ సెంటర్ వద్ద ఆమె మృతదేహం ఉన్న కారణంగా.. అక్కడున్న పేషెంట్ ఎవరైనా ఆమెపై దాడి చేసి ఉంటారా అన్న కోణంలోనూ విచారణ నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







