ఇరాన్ నుండి చమురు దిగుమతులు కొనసాగించనున్న భారత్
- October 08, 2018
న్యూఢిల్లీ : అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ నవంబర్లో ఇరాన్ నుండి భారత్ చమురు దిగుమతిని కొనసాగిస్తుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఇరాన్ నుండి చమురు దిగుమతిలో ప్రధానమైనదిగా, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దారునిగా భారత్ ఉందని అన్నారు. 2017-18లో భారత్ దిగుమతి చేసుకున్న 220.4 మిలియన్ మెట్రిక్ టన్నుల (మిలియన్ టన్నుల) ముడి చమురులో ఇరాన్ వాటా 9.4 శాతంగా ఉంది.' మన దేశీయ అవసరాలు తీరాలి. ఇప్పటికే నవంబర్లో చమురు దిగుమతి కోసం తమ కంపెనీలు వాటి కోటా కోసం నామినేట్ అయ్యాయి' అని ప్రధాన్ తెలిపారు. 'ప్రపంచ నేతలు మా అవసరాలను అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాం' అని ఢిల్లీలోని ఎనర్జీ ఫోరంలో ఆయన అన్నారు. నవంబర్ 4 నుండి ఇరాన్ చమురు దిగుమతిపై అమెరికా ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. గతవారం ఎక్సైజ్డ్యూటీ, ఇంధన ధరల తగ్గింపు మాట్లాడుతూ ఇవి చమురు ధరలను నియంత్రించలేవని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







