ఇరాన్‌ నుండి చమురు దిగుమతులు కొనసాగించనున్న భారత్

- October 08, 2018 , by Maagulf
ఇరాన్‌ నుండి చమురు దిగుమతులు కొనసాగించనున్న భారత్

న్యూఢిల్లీ : అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ నవంబర్‌లో ఇరాన్‌ నుండి భారత్‌ చమురు దిగుమతిని కొనసాగిస్తుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌ నుండి చమురు దిగుమతిలో ప్రధానమైనదిగా, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దారునిగా భారత్‌ ఉందని అన్నారు. 2017-18లో భారత్‌ దిగుమతి చేసుకున్న 220.4 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల (మిలియన్‌ టన్నుల) ముడి చమురులో ఇరాన్‌ వాటా 9.4 శాతంగా ఉంది.' మన దేశీయ అవసరాలు తీరాలి. ఇప్పటికే నవంబర్‌లో చమురు దిగుమతి కోసం తమ కంపెనీలు వాటి కోటా కోసం నామినేట్‌ అయ్యాయి' అని ప్రధాన్‌ తెలిపారు. 'ప్రపంచ నేతలు మా అవసరాలను అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాం' అని ఢిల్లీలోని ఎనర్జీ ఫోరంలో ఆయన అన్నారు. నవంబర్‌ 4 నుండి ఇరాన్‌ చమురు దిగుమతిపై అమెరికా ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. గతవారం ఎక్సైజ్‌డ్యూటీ, ఇంధన ధరల తగ్గింపు మాట్లాడుతూ ఇవి చమురు ధరలను నియంత్రించలేవని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com