ఇరాన్ నుండి చమురు దిగుమతులు కొనసాగించనున్న భారత్
- October 08, 2018
న్యూఢిల్లీ : అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ నవంబర్లో ఇరాన్ నుండి భారత్ చమురు దిగుమతిని కొనసాగిస్తుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఇరాన్ నుండి చమురు దిగుమతిలో ప్రధానమైనదిగా, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దారునిగా భారత్ ఉందని అన్నారు. 2017-18లో భారత్ దిగుమతి చేసుకున్న 220.4 మిలియన్ మెట్రిక్ టన్నుల (మిలియన్ టన్నుల) ముడి చమురులో ఇరాన్ వాటా 9.4 శాతంగా ఉంది.' మన దేశీయ అవసరాలు తీరాలి. ఇప్పటికే నవంబర్లో చమురు దిగుమతి కోసం తమ కంపెనీలు వాటి కోటా కోసం నామినేట్ అయ్యాయి' అని ప్రధాన్ తెలిపారు. 'ప్రపంచ నేతలు మా అవసరాలను అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాం' అని ఢిల్లీలోని ఎనర్జీ ఫోరంలో ఆయన అన్నారు. నవంబర్ 4 నుండి ఇరాన్ చమురు దిగుమతిపై అమెరికా ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. గతవారం ఎక్సైజ్డ్యూటీ, ఇంధన ధరల తగ్గింపు మాట్లాడుతూ ఇవి చమురు ధరలను నియంత్రించలేవని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







