జైషే మహ్మద్ అధినేత మసూద్ ఆరోగ్య పరిస్థితి విషమం
- October 09, 2018
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో భారత్, అఫ్గనిస్థాన్లలో జిహాదీ దాడులను అతని సోదరులు రాఫ్ అస్గర్, అత్తర్ ఇబ్రహీం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. 50 ఏళ్ల మసూద్ ప్రస్తుతం వెన్నెముక, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని ఓ అధికారి తెలిపారు. 'రావల్పిండిలోని ఓ మిలటరీ ఆస్పత్రిలో మసూద్ చికిత్స పొందుతున్నాడు. ఏడాదిన్నరగా అతడు మంచానికే పరిమితమయ్యాడు' అని ఆయన తెలిపారు. భారత్లో జరిగిన చాలా టెర్రరిస్ట్ దాడులకు మసూద్ సూత్రధారి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







