'తిత్లీ' ముప్పు.. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్‌

- October 09, 2018 , by Maagulf
'తిత్లీ' ముప్పు.. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్‌

తిత్లీ తుపాను ఇవాళ మధ్యాహ్నానికి తీవ్రంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో 510 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయం గోపాల్‌పూర్‌- ఏపీలోని కళింగపట్నం మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉండడం.. బుధ, గురువారాల్లో భారీ వర్షాలు, గాలుల నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.మరోవైపు తుపాను ముప్పు నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం తీర ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com