'గేమ్ ఓవర్' లో తాప్సీ
- October 10, 2018
ఉత్తరాది, దక్షిణాది చిత్రాల్లో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న నేటి తరం హీరోయిన్స్లో తాప్సీ ఒకరు. స్క్రిప్ట్స్ సెలక్షన్ విషయంలో అచితూచి అడుగులు వేస్తున్న తాప్సీ ఒక పక్క బాలీవుడ్తో పాటు సౌత్ సినిమాలను బ్యాలెన్స్డ్గా చేస్తుంది. ఇప్పుడు తాప్సీ ప్రధాన పాత్రలో నేటి నుండి కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి 'గేమ్ ఓవర్' అనే టైటిల్ను ఖరారు చేశారు. వీల్ చెయిర్లో తాప్సీ కూర్చున్న ఫోటోను విడుదల చేశారు. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కనున్న చిత్రమిది. గతంలో నయనతారతో `మాయ` (తెలుగులో మయూరి) అనే హారర్ థ్రిల్లర్ను తెరకెక్కించిన దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ అసోసియేషన్తో శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







