ఇరాన్ అదుపులో కర్నాటక జాలర్లు
- October 11, 2018
బెంగళూరు: కర్నాటకకు చెందిన తొమ్మిది మంది జాలర్లు ఇరాన్ అదుపులో ఉన్నారు. వీరంతా ఉత్తర కన్నడ జిల్లా సముద్రతీర పట్టణం బత్కల్కు చెందినవారు. దుబాయ్లో పనిచేసే వీరంతా గడిచిన ఏప్రిల్ 25వ తేదీన బత్కల్ నుంచి దుబాయ్కు బోటులో బయల్దేరి వెళ్లారు. జులై 21వ తేదీన అక్కడి సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో అనుకోకుండా ఇరాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. దీంతో అక్కడి అధికారులు వీరందరిని నిర్బంధంలోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి బోటులోనే నిర్బంధించారు. నిత్యావసారాల నిమిత్తం ఈ తొమ్మిది మందిలో ఏవరో ఒకరు ప్రతిరోజూ బయటికి వెళ్లి తమకు కావాల్సిన వస్తువులను తీసుకొచ్చేవారు. సహాయం కోరుతూ అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించారు. దీంతో జాలర్ల విడుదలకు భారత అధికారులు చర్యలు చేపట్టారు. మరో నెలలో వీరంతా విడుదల కానున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







