లుబాన్‌ సైక్లోన్‌: స్కూళ్ళు షెల్టర్లుగా మార్పు

- October 12, 2018 , by Maagulf
లుబాన్‌ సైక్లోన్‌: స్కూళ్ళు షెల్టర్లుగా మార్పు

మస్కట్‌: లుబాన్‌ తుపాను సమీపిస్తుండడంతో, వెస్టర్న్‌ దోఫార్‌లో అధికారులు, ఎనిమిది స్కూళ్ళను షెల్టర్లుగా మార్చారు. ఈ విషయాన్ని నేషనల్‌ కమిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ వెల్లడించింది. భారీ స్థాయిలో వర్షం కురవనుండడం, పెనుగాలులు వీచే అవకాశం వుండడంతో లోతట్టు ప్రాంతాల్లోనివారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో వారికి పక్కా భవనాల్ని షెల్టర్లుగా ఉపయోగించబోతున్నారు. విలాయత్‌ ఆఫ్‌ రోకెట్‌, విలాయత్‌ ధాల్‌కట్‌ మధ్య షెల్టర్లను ఏర్పాటు చేశారు. హోరూన్‌, షిర్షీత్‌, షాబ్‌ అసీబ్‌, అర్దీత్‌, అజ్దరూట్‌ స్కూళ్ళను షెల్టర్లుగా మార్చడం జరిగింది. గురువారం నుంచి గవర్నరేట్‌లో స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు లుబాన్‌ తుపాను నేపథ్యంలో. వాటిని పౌరులు, నివాసితులకు షెల్టర్లుగా ఉపయోగిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com