లుబాన్ సైక్లోన్: స్కూళ్ళు షెల్టర్లుగా మార్పు
- October 12, 2018
మస్కట్: లుబాన్ తుపాను సమీపిస్తుండడంతో, వెస్టర్న్ దోఫార్లో అధికారులు, ఎనిమిది స్కూళ్ళను షెల్టర్లుగా మార్చారు. ఈ విషయాన్ని నేషనల్ కమిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. భారీ స్థాయిలో వర్షం కురవనుండడం, పెనుగాలులు వీచే అవకాశం వుండడంతో లోతట్టు ప్రాంతాల్లోనివారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో వారికి పక్కా భవనాల్ని షెల్టర్లుగా ఉపయోగించబోతున్నారు. విలాయత్ ఆఫ్ రోకెట్, విలాయత్ ధాల్కట్ మధ్య షెల్టర్లను ఏర్పాటు చేశారు. హోరూన్, షిర్షీత్, షాబ్ అసీబ్, అర్దీత్, అజ్దరూట్ స్కూళ్ళను షెల్టర్లుగా మార్చడం జరిగింది. గురువారం నుంచి గవర్నరేట్లో స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు లుబాన్ తుపాను నేపథ్యంలో. వాటిని పౌరులు, నివాసితులకు షెల్టర్లుగా ఉపయోగిస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







