లుబాన్ సైక్లోన్: స్కూళ్ళు షెల్టర్లుగా మార్పు
- October 12, 2018మస్కట్: లుబాన్ తుపాను సమీపిస్తుండడంతో, వెస్టర్న్ దోఫార్లో అధికారులు, ఎనిమిది స్కూళ్ళను షెల్టర్లుగా మార్చారు. ఈ విషయాన్ని నేషనల్ కమిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. భారీ స్థాయిలో వర్షం కురవనుండడం, పెనుగాలులు వీచే అవకాశం వుండడంతో లోతట్టు ప్రాంతాల్లోనివారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో వారికి పక్కా భవనాల్ని షెల్టర్లుగా ఉపయోగించబోతున్నారు. విలాయత్ ఆఫ్ రోకెట్, విలాయత్ ధాల్కట్ మధ్య షెల్టర్లను ఏర్పాటు చేశారు. హోరూన్, షిర్షీత్, షాబ్ అసీబ్, అర్దీత్, అజ్దరూట్ స్కూళ్ళను షెల్టర్లుగా మార్చడం జరిగింది. గురువారం నుంచి గవర్నరేట్లో స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు లుబాన్ తుపాను నేపథ్యంలో. వాటిని పౌరులు, నివాసితులకు షెల్టర్లుగా ఉపయోగిస్తున్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు