బహ్రెయిన్:ఫేక్ పాస్పోర్ట్ కేసులో వ్యక్తికి ఊరట
- October 12, 2018
బహ్రెయిన్:ఇరాకీ జాతీయుల కోసం పాస్పోర్ట్ ఫోర్జరీలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న బహ్రెయినీ వ్యక్తికి న్యాయస్థానం ఊరటనిచ్చింది. సరైన ఆధారాల్ని చూపలేదన్న కారణంగా నిందితుడిపై అభియోగాల్ని న్యాయస్థానం పక్కన పెట్టింది. గతంలో నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఐదుగురికి సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అందులో ముగ్గురు ఇరాకీ జాతీయులు. ఐదో నిందితుడు బహ్రెయినీ వ్యక్తి. ఫోర్జరీ కేసులో తనకెలాంటి సంబంధం లేదని న్యాయస్థానానికి ఐదో నిందితుడు మొరపెట్టుకున్నాడు. తనకు ఫోన్లో వచ్చిన వాట్సాప్ ఇమేజ్ని చూశాననీ, ఆ వెంటనే దాన్ని డిలీట్ చేశానని అతను చెప్పాడు. మరో బహ్రెయినీ వ్యక్తి ఇరాకీలతో డీల్ కుదుర్చుకున్నాడు. మొత్తం 80,000 బహ్రెయినీ దినార్స్కి డీల్ కుదిరింది. అందులో ఇద్దరు టర్కీకి వెళ్ళారు పాస్పోర్ట్ ఫోర్జరీ కోసం. దాన్ని బహ్రెయినీ నిందితుడికి ఇచ్చేలా పథకం రచించారు. నేషనాలిటీ పాస్పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ ఎఫైర్స్లో ఓ వ్యక్తికి 30,000 బహ్రెయినీ దినార్స్ లంచం ఇచ్చేందుకు యత్నించగా, నిందితుడు ఆ పాస్పోర్ట్ని కాల్చివేయడం జరిగింది. కాగా, ఈ కేసులో ఇతర నిందితులు, తాము అసలు ఈ విషయంలో చేసిందేమీ లేదనీ, ఫేక్ పాస్పోర్టుల కోసం అడగలేదని కోర్టుకు విన్నవించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







