'BAPS' హిందూ మందిర్ వెబ్సైట్ ప్రారంభం
- October 12, 2018
అబుదాబీ: అబుదాబీలో నిర్మితం కానున్న బిఎపిఎస్ హిందూ మందిర్ పట్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇండియన్ కమ్యూనిటీ పట్ల అభిమానంతో మందిర నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో మందిర్ లిమిటెడ్,www.mandir.ae వెబ్సైట్ని ప్రారంభించింది. ఈ వెబ్సైట్ ద్వారా బిఎపిఎస్ హిందూ మందిర్కి సంబంధించి సమగ్ర సమాచారం అందరికీ అందుబాటులోకి వస్తుంది. బిఎపిఎస్ స్వామినారాయన్ సంస్థ ఈ మందిర నిర్మాణాన్ని చేపడుతోంది. భారత ప్రధాని నరేంద్రమోడీ, లాంఛనంగా ఈ మందిర నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెల్సిందే. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనుమతితో, మందిర్ లిమిటెడ్ వెబ్సైట్, మందిర్ నిర్మాణం కోసం విరాళాలు స్వీకరించేందుకు అవకాశం పొందింది. టెలర్ అనే యూఏఈ బేస్డ్ పేమెంట్ గేట్వే కంపెనీ ద్వారా సెక్యూర్ బ్యాక్ ఎండ్ పేమెంట్ గేట్వే సర్వీసు డోనర్స్ కోసం సేవలు అందిస్తుంది. డోనర్స్ ట్రాన్సాక్షన్ అత్యంత భద్రతతో కూడినది, అలాగే గోప్యత కలిగినదిగా డిజైన్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి