17.5 కిలోల డ్రగ్స్ స్వాధీనం, ఐదుగురి అరెస్ట్
- October 13, 2018
అబుదాబీ పోలీసులు 17.5 కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఐదుగురు ఆసియాకి చెందిన వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్స్ని దేశంలోని యంగ్స్టర్స్కి నిందితులు విక్రయిస్తున్నట్లు గుర్తించామని పోలీస్ అధికారులు వెల్లడించారు. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ సుహైల్ అల్ రషిది ఈ విషయాల్ని వెల్లడించారు. రెండు ఆపరేషన్లలో ఈ అరెస్టులు జరిగాయి. ఓ ఆపరేషన్లో 12 కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 8 కిలోల హెరాయిన్, 4 కిలోల క్రిస్టల్ మెత్ వున్నాయి. మరో టనలో 5.5 కిలోల క్రిస్టల్ మిత్ని మొబైల్ ఫోన్ షాప్ నుంచి స్వాధీనం చేసుకున్నామని బ్రిగేడియర్ అaలల్ రష్ది చెప్పారు. ఇటీవలే పోలీస్, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్స్ని ముమ్మరం చేశాయి. 'మై లైఫ్ ఈస్ ప్రైస్లెస్' పేరుతో సెప్టెంబర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డ్రగ్స్ కారణంగా జీవితాలు ఎలా నాశనమైపోతాయో ఈ కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







