17.5 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం, ఐదుగురి అరెస్ట్‌

- October 13, 2018 , by Maagulf
17.5 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం, ఐదుగురి అరెస్ట్‌

అబుదాబీ పోలీసులు 17.5 కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఐదుగురు ఆసియాకి చెందిన వ్యక్తుల్ని కూడా అరెస్ట్‌ చేయడం జరిగింది. డ్రగ్స్‌ని దేశంలోని యంగ్‌స్టర్స్‌కి నిందితులు విక్రయిస్తున్నట్లు గుర్తించామని పోలీస్‌ అధికారులు వెల్లడించారు. క్రిమినల్‌ సెక్యూరిటీ సెక్టార్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ మొహమ్మద్‌ సుహైల్‌ అల్‌ రషిది ఈ విషయాల్ని వెల్లడించారు. రెండు ఆపరేషన్లలో ఈ అరెస్టులు జరిగాయి. ఓ ఆపరేషన్‌లో 12 కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 8 కిలోల హెరాయిన్‌, 4 కిలోల క్రిస్టల్‌ మెత్‌ వున్నాయి. మరో టనలో 5.5 కిలోల క్రిస్టల్‌ మిత్‌ని మొబైల్‌ ఫోన్‌ షాప్‌ నుంచి స్వాధీనం చేసుకున్నామని బ్రిగేడియర్‌ అaలల్‌ రష్ది చెప్పారు. ఇటీవలే పోలీస్‌, యాంటీ డ్రగ్‌ క్యాంపెయిన్స్‌ని ముమ్మరం చేశాయి. 'మై లైఫ్‌ ఈస్‌ ప్రైస్‌లెస్‌' పేరుతో సెప్టెంబర్‌లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డ్రగ్స్‌ కారణంగా జీవితాలు ఎలా నాశనమైపోతాయో ఈ కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com