17.5 కిలోల డ్రగ్స్ స్వాధీనం, ఐదుగురి అరెస్ట్
- October 13, 2018
అబుదాబీ పోలీసులు 17.5 కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఐదుగురు ఆసియాకి చెందిన వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్స్ని దేశంలోని యంగ్స్టర్స్కి నిందితులు విక్రయిస్తున్నట్లు గుర్తించామని పోలీస్ అధికారులు వెల్లడించారు. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ సుహైల్ అల్ రషిది ఈ విషయాల్ని వెల్లడించారు. రెండు ఆపరేషన్లలో ఈ అరెస్టులు జరిగాయి. ఓ ఆపరేషన్లో 12 కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 8 కిలోల హెరాయిన్, 4 కిలోల క్రిస్టల్ మెత్ వున్నాయి. మరో టనలో 5.5 కిలోల క్రిస్టల్ మిత్ని మొబైల్ ఫోన్ షాప్ నుంచి స్వాధీనం చేసుకున్నామని బ్రిగేడియర్ అaలల్ రష్ది చెప్పారు. ఇటీవలే పోలీస్, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్స్ని ముమ్మరం చేశాయి. 'మై లైఫ్ ఈస్ ప్రైస్లెస్' పేరుతో సెప్టెంబర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డ్రగ్స్ కారణంగా జీవితాలు ఎలా నాశనమైపోతాయో ఈ కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







