రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
- October 15, 2018
దుబాయ్లోని పామ్ జుమైరా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. అధిక బరువు కారణంగా ట్రక్ డ్రైవర్ అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కులో పండ్లు, కూరగాయలు వున్నాయి. దుబాయ్ పోలీస్ మీడియా సెక్షన్ డైరెక్టర్ కల్నల్ ఫైసల్ ఇస్సా అల్ కాసిమ్ మాట్లాడుతూ, ఉదయం 5.50 నిమిషాలకు ప్రమాదం జరగ్గా, వెంటనే పోలీసులు అలర్ట్ అయినట్లు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేశామనీ, గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతోపాటుగా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు కల్నల్ అల్ కాసిమ్.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







