రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
- October 15, 2018
దుబాయ్లోని పామ్ జుమైరా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. అధిక బరువు కారణంగా ట్రక్ డ్రైవర్ అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కులో పండ్లు, కూరగాయలు వున్నాయి. దుబాయ్ పోలీస్ మీడియా సెక్షన్ డైరెక్టర్ కల్నల్ ఫైసల్ ఇస్సా అల్ కాసిమ్ మాట్లాడుతూ, ఉదయం 5.50 నిమిషాలకు ప్రమాదం జరగ్గా, వెంటనే పోలీసులు అలర్ట్ అయినట్లు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేశామనీ, గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతోపాటుగా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు కల్నల్ అల్ కాసిమ్.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







