దుబాయ్లో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మెడిటేషన్ మాస్టర్ క్లాస్
- October 15, 2018
దుబాయ్:మానవతావాది, స్పిరిట్యువల్ లీడర్, శాంతి దూత గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ప్రవచనాల్ని ప్రపంచ వ్యాప్తంగా 370 మిలియన్ మంది అనుసరిస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో శ్రీశ్రీ రవిశంకర్ నిర్వహించనున్న కార్యక్రమంలో 6000 మంది పాల్గొననున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, అలాగే ఐఎహెచ్వి ద్వారా మిడిల్ ఈస్ట్లో అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. దుబాయ్లో శ్రీశ్రీ రవిశంకర్, రెండు రోజులపాట మెడటేషన్ మాస్టర్ క్లాస్ని నిర్వహించబోతున్నట్లు ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ వెల్లడించారు. 'అన్వీలింగ్ ఇన్ఫినిటీ' పేరుతో ఈ కార్యక్రమాన్ని 16 మరియు 17 తేదీల్లో నిర్వహిస్తారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద నిర్వహించే ఈ కార్యక్రమానికి పెద్ద యెత్తున ఔత్సాహికులు పాల్గొంటారు. సుమారు 6000 మంది పార్టిసిపెంట్లు ఈ మెడిషేన్ ఈవెంట్లో పాల్గొంటారనేది ఓ అంచనా. అన్వీలింగ్ ఇన్ఫినిటీలో పాల్గొనే పార్టిసిపెంట్స్కి 1000, 3000 అరబ్ ఎమిరేట్ దినార్స్ ఫీజుగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు www.gurudev.ae వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.


తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







