దుబాయ్లో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మెడిటేషన్ మాస్టర్ క్లాస్
- October 15, 2018
దుబాయ్:మానవతావాది, స్పిరిట్యువల్ లీడర్, శాంతి దూత గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ప్రవచనాల్ని ప్రపంచ వ్యాప్తంగా 370 మిలియన్ మంది అనుసరిస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో శ్రీశ్రీ రవిశంకర్ నిర్వహించనున్న కార్యక్రమంలో 6000 మంది పాల్గొననున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, అలాగే ఐఎహెచ్వి ద్వారా మిడిల్ ఈస్ట్లో అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. దుబాయ్లో శ్రీశ్రీ రవిశంకర్, రెండు రోజులపాట మెడటేషన్ మాస్టర్ క్లాస్ని నిర్వహించబోతున్నట్లు ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ వెల్లడించారు. 'అన్వీలింగ్ ఇన్ఫినిటీ' పేరుతో ఈ కార్యక్రమాన్ని 16 మరియు 17 తేదీల్లో నిర్వహిస్తారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద నిర్వహించే ఈ కార్యక్రమానికి పెద్ద యెత్తున ఔత్సాహికులు పాల్గొంటారు. సుమారు 6000 మంది పార్టిసిపెంట్లు ఈ మెడిషేన్ ఈవెంట్లో పాల్గొంటారనేది ఓ అంచనా. అన్వీలింగ్ ఇన్ఫినిటీలో పాల్గొనే పార్టిసిపెంట్స్కి 1000, 3000 అరబ్ ఎమిరేట్ దినార్స్ ఫీజుగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు www.gurudev.ae వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.


తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







