హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ కలకలం.. ఆరుగురుమృతి
- October 16, 2018
హైదరాబాద్ లో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. నగరంలో గడిచిన 15రోజుల్లో ఈ స్వైన్ ఫ్లూ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రజలు భయందోళనకు గురౌతున్నారు. దీనిని అదుపుచేసేందుకు వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు.
వాతావరణంలో సడెన్ గా వచ్చిన మార్పుల కారణంగా చాలా మంది జ్వరం బారిన పడుతున్నరని వైద్యులు చెబుతున్నారు. రోజురోజుకీ స్వైన్ ఫ్లూ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
దగ్గు, జ్వరం, వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పులు, నీరసించిపోవడం, ఒళ్లుపై గుళ్లలు ఏర్పడటం వంటివి స్వైన్ ఫ్లూ లక్షణాలు. ఇలాంటి లక్షణాలుంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. సంవత్సరానికి సరిపడా వాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈ స్వైన్ ఫ్లూ అనేది అన్ని వర్గాల వారికి వస్తుందని, ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఎక్కువగా నవంబర్-డిసెంబర్ నెలల్లోనే ఈ స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. రెండు నెలల క్రితంతోపోలిస్తే.. జ్వరపీడితలు ప్రస్తుతం రెట్టింపు అయినట్లు వారు చెబుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఫిఫా వరల్డ్ కప్ సెమీస్లో ఫ్రాన్స్ పై స్పెయిన్ ఘన విజయం
- 77వ వసంతంలోకి అడుగుపెట్టిన దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్
- సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్







