జర్నలిస్టు హత్య.. సౌదీ రాజును కలవనున్న అమెరికా మంత్రి
- October 16, 2018
సౌదీ: సౌదీ అరేబియా జర్నలిస్టు ఖషోగ్గి అదృశ్య కేసు తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో.. ఇవాళ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో.. సౌదీ రాజు కింగ్ సల్మాన్ను కలుసుకోనున్నారు. సల్మాన్ను కలిసిన తర్వాత పొంపియో.. టర్కీని కూడా విజిట్ చేయనున్నారు. రెండు వారాల క్రితం ఇస్తాంబుల్లోని సౌదీ కౌన్సులేట్కు వెళ్లిన తర్వాత ఖషోగ్గి అదృశ్యమయ్యారు. అయితే జర్నలిస్టు ఖషోగి హత్యకు గురైనట్లు స్థానిక మీడియా కథనాలు రాసింది. సౌదీ ఏజెంట్లు ఖషోగ్గిని హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానీ సౌదీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. దుష్ట హంతకులను పట్టుకుంటామని కూడా ట్రంప్ అన్నారు. ఖషోగ్గి హత్య కేసులో సౌదీ రాజు సల్మాన్తోనూ ట్రంప్ మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఆ హత్య గురించి తనకు ఏమీ తెలియదని కింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. అదృశ్యమైన ఖషోగ్గి అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్టు పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







