జర్నలిస్టు హత్య.. సౌదీ రాజును కలవనున్న అమెరికా మంత్రి
- October 16, 2018
సౌదీ: సౌదీ అరేబియా జర్నలిస్టు ఖషోగ్గి అదృశ్య కేసు తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో.. ఇవాళ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో.. సౌదీ రాజు కింగ్ సల్మాన్ను కలుసుకోనున్నారు. సల్మాన్ను కలిసిన తర్వాత పొంపియో.. టర్కీని కూడా విజిట్ చేయనున్నారు. రెండు వారాల క్రితం ఇస్తాంబుల్లోని సౌదీ కౌన్సులేట్కు వెళ్లిన తర్వాత ఖషోగ్గి అదృశ్యమయ్యారు. అయితే జర్నలిస్టు ఖషోగి హత్యకు గురైనట్లు స్థానిక మీడియా కథనాలు రాసింది. సౌదీ ఏజెంట్లు ఖషోగ్గిని హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానీ సౌదీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. దుష్ట హంతకులను పట్టుకుంటామని కూడా ట్రంప్ అన్నారు. ఖషోగ్గి హత్య కేసులో సౌదీ రాజు సల్మాన్తోనూ ట్రంప్ మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఆ హత్య గురించి తనకు ఏమీ తెలియదని కింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. అదృశ్యమైన ఖషోగ్గి అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్టు పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







