లాభాల బాటలో ఇన్ఫోసిస్
- October 16, 2018
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అద్భుత ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను మించి కంపెనీ ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ టెక్నాలజీ రూ. 4110 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మార్కెట్ విశ్లేషకులు రూ. 4048 కోట్లు అంచనా వేశారు. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 20,609 కోట్ల టర్నోవర్ సాధించింది. మొత్తం వ్యాపారంలో డిజిటల్ విభాగం వాటా 31 శాతానికి చేరినట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 22 శాతం నుంచి 24 శాతం వరకు ఉండొచ్చని ఇన్ఫోసిస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







