సహచరుడిపై కత్తిపోట్లు: నిందితుడి అరెస్ట్
- October 16, 2018
ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. నిందితుడు, తన సహచరుడ్ని కత్తితో అతి కిరాతకంగా పొడిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు వివరాల్లోకి వెళితే, శ్రీలంకకు చెందిన 39 ఏళ్ళ వ్యక్తి, ఉమ్ సకీయుమ్ బస్ స్టేషన్ దగ్గర్లో నెత్తుటి మడుగులో పడి వుండగా అతన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే, అతని ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గాయం కారణంగా రక్తం పోయిందని పేర్కొన్న వైద్యులు, అత్యవసర వైద్య చికిత్స ప్రారంభించారు. ఈ కేసు విచారణలో పోలీసులు, ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేశారు. బాధితుడి సహచరుడే నిందితుడని పేర్కొన్న పోలీసులు, అతన్ని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







