ధైర్యంగా మాట్లాడండీ:హీరో విశాల్
- October 16, 2018
దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘మీ టు’ ఉద్యమానికి నడిగర్ సంగం ప్రధాన కార్యదర్శి , హీరో విశాల్ మద్దతు పలికారు. లైంగిక వేధింపులపై తనుశ్రీ దత్తా, సింగర్ చిన్మయి ల ఆరోపణలను గౌరవిస్తూ ట్వీట్ చేశారు విశాల్.. ‘ఇదే కరెక్ట్ టైమ్. సినీ రంగంలో మహిళలు ధైర్యంగా మాట్లాడండీ. మీకు నేను అండగా ఉంటా. భద్రత కల్పించడానికి ఓ కమిటీగా ఏర్పడతాం. లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయట పెట్టిన చిన్మయి, తనుశ్రీదత్తా తదితరులను గౌరవిస్తున్నా’ అని విశాల్ ట్వీట్ చేశారు. కాగా గతంలో నటి శ్రీరెడ్డి కూడా క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలుంటే బయటపెట్టాలని ఆమెకు సూచించాడు. కొన్ని రోజుల కిందట తన స్నేహితురాలు, నటి వరలక్ష్మి సైతం లైంగిక వేధింపులకు గురైనప్పుడు ఆమె ధైర్యంగా ముందుకు వచ్చి దీనిపై పోరాడిందని అప్పట్లో విశాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







