నేడు తెరుచుకోనున్న శబరిమల
- October 16, 2018
మాస పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఈరోజు సాయంత్రం నుంచి ఐదు రోజులపాటు తెరుచుకోనుంది. అన్ని వయసుల స్త్రీలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తరువాత నేడు ఆలయాన్ని తెరుస్తున్నారు. ఇప్పటికే కేరళ వ్యాప్తంగా సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకు ప్రధాన ద్వారమైన నిలక్కళ్ వద్దకు చేరి నిషేధిత వయస్సుల్లోని స్త్రీలను కొండ ఎక్కనివ్వకుండా అడ్డుకుంటున్నారు.
ఆలయ భాగస్వామ్య పక్షాలతో నిన్న ట్రావెన్కోర్ దేవస్థాన మండలి భేటీ అయినప్పటికీ ఏకాభిప్రాయం లేకపోవడంతో కేరళలో నిరసనలను తగ్గించేందుకు తోడ్పడే పెద్ద నిర్ణయాలేవీ తీసుకోలేకపోయింది. తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా సుప్రీంకోర్టును తాము కోరేది లేదని కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పడం, అటు కేంద్రం నుంచి కూడా స్పందన లేకపోవడంతో నిరసనలు తాజాగా మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ విషయంపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. అయ్యప్ప గుడికి వెళ్తున్న మహిళలను నిలక్కళ్ వద్ద భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తు లు అడ్డుకుంటున్నారని తెలిపారు. ప్రైవేటు వాహనాలేగాక కేఎస్ఆర్టీసీ బస్సుల్లోకి ఎక్కి నిషేధిత వయస్సుల్లో ఉన్న స్త్రీలను కిందికి దించి వేస్తున్నారు.
ఆలయానికి వెళ్తున్న భక్తులను అడ్డుకునేందుకు తాము ఎవరినీ అనుమతించబోమని చెప్పారు. భక్తులను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ సీఎం విజయన్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!