మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారి కన్నుమూత
- October 18, 2018ప్రముఖ రాజకీయ దిగ్గజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన ఎన్డీ తివారి కన్నుమూశారు. అస్వస్థతకు గురైన ఆయన కొద్ది రోజులుగా దిల్లీలోని సాకేత్ ఆస్పత్రిలోచికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగానూ ఆయన సేవలందించారు. 1925 అక్టోబర్ 18న ఉత్తరాఖండ్లోని నైనిటాల్జిల్లా బాలూటి గ్రామంలో జన్మించిన తివారీ పూర్తి పేరు నారాయణ దత్ తివారి. ప్రస్తుతం ఆయన వయస్సు 92 ఏళ్లు. ఈ రోజే తివారి 93వ పుట్టిన రోజు కావడం గమనార్హం. 2007 ఆగస్టు 19న ఏపీ గవర్నర్గా నియమితులైన తివారి 2009 డిసెంబర్ మాసంలో తన పదవికి రాజీనామా చేశారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు