మొబైల్ నంబర్లు డిస్కనెక్ట్ చేయడం లేదు : ఉడాయ్, టెలికాం శాఖ
- October 18, 2018
ఆధార్తో అనుసంధానం చేసుకున్న ఏ మొబైల్ నంబర్ను డిస్కనెక్ట్ చేయడం లేదని కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖ, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) సంయుక్తంగా తెలియజేశాయి. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశాయి. ఆధార్తో లింక్ చేసుకున్న 50కోట్ల మొబైల్ నంబర్ల కనెక్షన్ను నిలిపివేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్గా మారింది. ఈ నేపథ్యంలోనే అటువంటి చర్యలేవీ తీసుకోవడం లేదని స్పష్టం చేస్తూ ఉడాయ్ ప్రకటనను విడుదల చేసింది.
'కొత్తగా తీసుకునే సిమ్ కార్డులకు ఆధార్ ఈ-కేవైసీ ప్రాసెస్ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాని.. ఆధార్ లింక్ చేసుకున్న పాత మొబైల్ నంబర్లను డీయాక్టివేట్ చేయడం లేదు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాత వినియోగదారులు ఆధార్ను డీ లింక్ చేసుకోవాలంటే ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర కార్డుల వివరాలతో కొత్తగా కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. ఇది వినియోగదారులకు ఒక ఆప్షన్ మాత్రమే.. తప్పనిసరి కాదు. ఎట్టిపరిస్థితుల్లోను మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్ చేయడం లేదు' అని టెలికం శాఖ, ఉడాయ్ తన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
ఆధార్ డీ లింక్ చేసే ప్రణాళికను పదిహేను రోజుల్లో ఇవ్వాలని ఉడాయ్ టెలికాం సంస్థలను కోరింది. ఆధార్ను టెలికాం వినియోగదారుల గుర్తింపు కోసం ఉపయోగించడం నిలిపివేయాలని తెలిపింది. ఆధార్ డీ లింక్ చేసే ప్రణాళికలను అక్టోబరు 15వ తేదీ నాటికి అందజేయాలని ఉడాయ్ నోటీసుల్లో పేర్కొంది. మొబైల్ నంబర్తో ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం లేదని, బ్యాంకు ఖాతాలు, స్కూల్ అడ్మిషన్లకు కూడా ఆధార్ తప్పనిసరి కాదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. టెలికాం సంస్థలు సహా ప్రైవేటు కంపెనీలు ఆధార్ నంబరు అడగడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









