ఈ నెల 20న రాహుల్ టూర్లో స్వల్పమార్పు
- October 18, 2018
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ….. తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు, 27 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే… రేపటి పర్యటనకు సంబంధించి టీపీసీసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. కానీ తాజాగా రాహుల్ పర్యటనలో స్వల్ప మార్పులు చేసింది..
తాజా షెడ్యూల్ ప్రకారం.. రాహుల్ నాందేడ్ నుంచి ముందుగా బైంసాకు చేరకుంటారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు బైంసాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం…. 2.30 నుంచి 3.30 గంటల వరకు కామారెడ్డి బహిరంగ సభలో ప్రసగింస్తారు. ఆ తర్వాత .అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని.. చార్మినార్ వద్ద సాయంత్రం జరిగే రాజీవ్ సద్భావన దినోత్సవంలో పాల్గొంటారు. తర్వాత రాత్రి 7 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
రాహుల్ పర్యటనతో తెలంగాణలో పార్టీ ప్రచారానికి ఊపు వచ్చే విధంగా సభలను నిర్వహించాలని టీపీసీసీ యోచిస్తోంది. కాగా తొలుత నిర్ణయించిన షెడ్యూల్ మేరకు రాహుల్ రేపు ఉదయం చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన దినోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. కానీ ఈ షెడ్యూల్ను మార్చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







