ఈ నెల 20న రాహుల్ టూర్లో స్వల్పమార్పు
- October 18, 2018ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ….. తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు, 27 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే… రేపటి పర్యటనకు సంబంధించి టీపీసీసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. కానీ తాజాగా రాహుల్ పర్యటనలో స్వల్ప మార్పులు చేసింది..
తాజా షెడ్యూల్ ప్రకారం.. రాహుల్ నాందేడ్ నుంచి ముందుగా బైంసాకు చేరకుంటారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు బైంసాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం…. 2.30 నుంచి 3.30 గంటల వరకు కామారెడ్డి బహిరంగ సభలో ప్రసగింస్తారు. ఆ తర్వాత .అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని.. చార్మినార్ వద్ద సాయంత్రం జరిగే రాజీవ్ సద్భావన దినోత్సవంలో పాల్గొంటారు. తర్వాత రాత్రి 7 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
రాహుల్ పర్యటనతో తెలంగాణలో పార్టీ ప్రచారానికి ఊపు వచ్చే విధంగా సభలను నిర్వహించాలని టీపీసీసీ యోచిస్తోంది. కాగా తొలుత నిర్ణయించిన షెడ్యూల్ మేరకు రాహుల్ రేపు ఉదయం చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన దినోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. కానీ ఈ షెడ్యూల్ను మార్చేశారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం