నిఖిల్..నివేద..'శ్వాస'
- October 18, 2018
హైదరాబాద్: యువ కథానాయకుడు నిఖిల్, నివేదా థామస్ జంటగా ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. కిషన్ కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి 'శ్వాస' అనే టైటిల్ను ఖరారు చేశారు. విజయదశమిని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్లో ఈరోజు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోషల్మీడియా ద్వారా వెల్లడిస్తూ టైటిల్ పోస్టర్ను విడుదల చేశాయి. పోస్టర్లో నిఖిల్, నివేదా ఓ రహదారిపై నడుచుకుంటూ వెళుతున్నట్లు కన్పించారు. నిఖిల్ ఆకాశం వైపు టార్చ్లైట్ను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
తేజ్ ఉప్పలపాటి, హరిణికేశ్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ 'ముద్ర' అనే మరో చిత్రంతోనూ బిజీగా ఉన్నారు. సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో వచ్చిన 'కణిథన్' అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్గా రాబోతోంది. ఇందులో నిఖిల్కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. నిఖిల్ విలేకరి పాత్రను పోషిస్తున్నారు. మరోపక్క నివేదా..కల్యాణ్ రామ్కు జోడీగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. దీనిలో షాలిని పాండే మరో కథానాయికగా కన్పించనున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి