నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు బీభత్సం.. చిన్నారి పరిస్థితి విషమం
- October 22, 2018
సికింద్రాబాద్లో గత రాత్రి సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు బీభత్సం సృష్టించింది. ఇంపీరియల్ గార్డెన్ వద్ద ఈ ఘటన జరిగింది. రాంగ్రూట్లో దూసుకొచ్చిన దగ్గుబాటి కారు… అదుపు తప్పి బైక్ను ఢీకొంది. దీంతో బైక్పై వెళ్తున్న దంపతులతో పాటు చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన దగ్గుబాటి సురేష్కు 41A నోటీసులు ఇచ్చారు పోలీసులు.
ప్రమాద సమయంలో ఆయనే స్వయంగా కారుని నడిపినట్లు తెలుస్తోంది. సురేశ్ బాబు కారు ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దానిపై సురేశ్ చంద్ర, ఆయన భార్య దుర్గాదేవి, వారి కుమారుడు సిద్ధేశ్ గాయపడ్డారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతోన్న చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దుర్గాదేవికి స్వల్పగాయాలు కావడంతో ఆమెకు చికిత్స చేసి డిశ్చార్జి చేశారు. చంద్రకు కాలికి గాయం కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో కారు వేగం 100 కిలోమీటర్లపైనే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడాన్ని బట్టి కారు వేగాన్ని అంచనా వేసినట్లు చెబుతున్నారు.
ప్రమాదం జరిగినట్లు పోలీసులకు తెలియజేసిన సురేష్ బాబు అతనే స్వయంగా క్షతగాత్రులను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. కారును పోలీస్ స్టేషన్లో అప్పగించి పూచీకత్తుపై వెళ్లినట్లు పోలీసులు తెలియజేసారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!