సిగరెట్ పొగతో నిండిన గదిలో శ్రియ..
- October 22, 2018
అందాల తార శ్రియ శ్రీమతిగా మారిన తరువాత వస్తున్న మొదటి చిత్రం వీర భోగ వసంత రాయలు. ఓ డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్న శ్రియ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొన్న శ్రియ ఓ వైవిధ్యభరితమైన పాత్రను పోషించినట్లు తెలిపింది. సిగరెట్ తాగడం, మందు కొట్టే సన్నివేశాల్లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించినట్లు చెప్పింది.
ఒక గదిలో ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు గది అంతా సిగరెట్ పొగతో నిండిపోయిందని తెలిపింది. పొగకు గది ఉన్నవారంతా ఇబ్బంది పడ్డామని చెప్పింది. ఇలాంటి సీన్లు చేయడం చాలా కష్టంగా అనిపించినప్పటికీ సినిమా రిజల్ట్ చూసి అవన్నీ మరచిపోతామని చెప్పింది. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథ ఇది అని చిత్ర నిర్వాహకులు తెలియజేసారు. ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అప్పారావ్ బెల్లాన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..