స్వదేశానికి వస్తూ మార్గమధ్యంలో చిన్నారి..
- October 23, 2018
ఉపాధి కోసం కువైట్ వెళ్లింది కడప జిల్లా రాజంపేటకు చెందిన యడపల్లి శివ ప్రసాద్ కుటుంబం. భార్య బిడ్డలతో అక్కడ నివసిస్తున్నాడు. శివ ఒక ప్రముఖ ట్రావెల్ ఏజన్సీలో పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు స్వదేశానికి వచ్చి వెళుతూ అయిన వాళ్లందర్నీ పలకరిస్తుంటారు. బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లినా భారత్ రావడమంటే తెలియని ఆనందం. కొన్ని రోజులు కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలని శివ భార్యా, పిల్లలు కువైట్ నుంచి కడపకు వస్తున్నారు. మార్గమధ్యంలో వారి చిన్నారి యశ్విని తీవ్ర అస్వస్థతకు గురైంది.
ఇది గమనించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది విమానాన్ని ఒమన్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వైద్యనిమిత్తంగా ఆసుపత్రికి తరలించే లోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అయితే విమానంలో ఆక్సిజన్ సకాలంలో అందక చిన్నారి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఎయిర్లైన్స్కు తెలపకపోవడం వల్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని తెలుస్తోంది.
తాజా వార్తలు
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!
- కువైట్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లింపులపై కొత్త నిబంధనలు..!!
- సౌదీలో విజిట్ వీసా గడువు దాటితే 50 వేల రియాల్స్ ఫైన్, జైలుశిక్ష..!!
- యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!
- రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ కు 25 ఏళ్లు..!!
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..







