రైలు పట్టాలు దాటితే జైలే
- October 23, 2018
హైదరాబాద్ : రైలు పట్టాలు దాటినా, ట్రాక్పైకి వచ్చినా కఠిన చర్యలు తప్పవని దక్షిణమధ్యరైల్వే ఓ ప్రకటనలో హెచ్చరించింది. రైల్వేచట్టం 1989 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించేవారిపై సెక్షన్ 147 ప్రకారం ఆరునెలల వరకు జైలు శిక్ష.. రూ.1000 జరిమానా.. లేదంటే రెండూ ఉంటాయని స్పష్టంచేసింది. పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో ఇటీవల జరిగిన ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ అప్రమత్తమైంది. భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు పేర్కొంది. సురక్షిత ప్రయాణం కోసం ఇటు ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలు రైల్వే నిబంధనల్ని పాటించాలని కోరింది. * రైల్వేస్టేషన్లలో, మార్గమధ్యలో గానీ పట్టాలపైనుంచి వెళ్లొద్దు. స్టేషన్లలో అయితే పాదచారుల వంతెనల ద్వారా ట్రాక్కు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లాలి. ఇతరచోట్ల సబ్వేలు, రోడ్అండర్బ్రిడ్జిలు, రైల్వేక్రాసింగ్ల ద్వారా దాటాలి.
* రైల్వేట్రాక్ సమీపంలోను, రైలు ఎక్కేటప్పుడు గానీ ఫోన్ వాడొద్దు.
* ట్రాక్ సమీపంలో ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టవద్దు. ట్రాక్పై, సమీపంలో సెల్ఫీలు దిగొద్దు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..